*జిల్లా అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ సమావేశం – మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధికి ₹6.60 కోట్లు సాధించిన టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి.జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు ,జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.శిరి ,జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో జిల్లా స్థాయి బడ్జెట్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి , వారి తనయులు యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ, సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్ టు పాయింట్గా సూచనలు అందించారు.మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.అనంతరం జిల్లా అధికారులు, బీజేపీ–జనసేన జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.జిల్లా బడ్జెట్లో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి పలు ముఖ్యమైన నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం.మంత్రాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.5 కోట్లుమంత్రాలయంలో మైనార్టీ సాధికార కేంద్రానికి రూ.80 లక్షలు.కోసిగి వాల్మీకి భవన్ నిర్మాణానికి రూ.80 లక్షలుఈ నిధుల కేటాయింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
*జిల్లా అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ సమావేశం – మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధికి ₹6.60 కోట్లు సాధించిన టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి.జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు ,జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.శిరి ,జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో జిల్లా స్థాయి బడ్జెట్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి , వారి తనయులు యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ, సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్ టు పాయింట్గా సూచనలు అందించారు.మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.అనంతరం జిల్లా అధికారులు, బీజేపీ–జనసేన జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.జిల్లా బడ్జెట్లో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి పలు ముఖ్యమైన నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం.మంత్రాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.5 కోట్లుమంత్రాలయంలో మైనార్టీ సాధికార కేంద్రానికి రూ.80 లక్షలు.కోసిగి వాల్మీకి భవన్ నిర్మాణానికి రూ.80 లక్షలుఈ నిధుల కేటాయింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.1
- కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.1
- ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.1
- Post by T.Shiva Krishna1
- రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.1
- రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.1
- ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…1