మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లను పరిశీలించారు. పాలకూర పప్పు పలుచగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పాలకూర పప్పు ఇంత పల్చగా వండుతారా అని వంట సిబ్బందిపై మండి పడ్డారు. మెనూ పాటిస్తున్న కూరలు నాణ్యతతో ఉండాలని ఇష్టానుసారంగా ఏదో మొక్కుబడిగా వంట చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థులకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం కోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పలు రకాల కూరగాయలను కూడిన భోజనాన్ని పెడుతుందని మధ్యాహ్నం భోజన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలని ఆకుకూరల్లో మునగా ఆకు వాడాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు. పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ ఏం తిన్నారు భోజనం ఎలా ఉందనీ అడగ్గ గుడ్డు అన్నం తిన్నామని పిల్లలు కలెక్టర్ కి తెలిపారు. అనంతరం మండలంలోని తంగళ్లపల్లి గ్రామం లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఆహార పదార్థాలు తనికి చేస్తూ రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా వండాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.
మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లను పరిశీలించారు. పాలకూర పప్పు
పలుచగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పాలకూర పప్పు ఇంత పల్చగా వండుతారా అని వంట సిబ్బందిపై మండి పడ్డారు. మెనూ పాటిస్తున్న కూరలు నాణ్యతతో ఉండాలని ఇష్టానుసారంగా ఏదో మొక్కుబడిగా వంట చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థులకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం కోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పలు రకాల
కూరగాయలను కూడిన భోజనాన్ని పెడుతుందని మధ్యాహ్నం భోజన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలని ఆకుకూరల్లో మునగా ఆకు వాడాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు. పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ ఏం తిన్నారు భోజనం ఎలా ఉందనీ అడగ్గ గుడ్డు అన్నం తిన్నామని
పిల్లలు కలెక్టర్ కి తెలిపారు. అనంతరం మండలంలోని తంగళ్లపల్లి గ్రామం లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఆహార పదార్థాలు తనికి చేస్తూ రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా వండాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలువ కోసం రైతన్నలు కన్నీటి పర్యంతమై రంగనాయకసాగర్ 11/6 కాలువను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నెల రోజులుగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో కాలువ సాధన దీక్షా చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 11 (RD3 LM6) కాలువ పనులు చివరి దశలో నిలిచిపోవడంతో 12 గ్రామాల రైతులకు సాగు నీరు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కిలోమీటర్ కాలువ పనులు పూర్తి చేస్తే ఇల్లంతకుంట తంగళ్ళపల్లి మండలాల్లోని 12 గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మెట్ట ప్రాంతంలో నీటి వసతి లేక మగవాళ్ళు గల్ఫ్ దేశాలకు వలస పోతే అక్కడ యుద్దంతో పరిస్థితి బాగాలేదని మహిళా రైతు కన్నీటి పర్యంతమై గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అటు రసమయి బాలకిషన్ సైతం కేటీఆర్ ద్వారా అసెంబ్లీలో కాలువ గురించి మాట్లాడించి త్వరగా పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులు నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు సాగునీరు అందించేందుకు ఎల్ఎం6 కెనాల్ పనులను తక్షణమే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.2
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.4
- तेलंगाना में दर्दनाक हादसा, करंट लगने से दो लोग जिंदा जले; सामने आया VIDEO मंचेरियाल: तेलंगाना के मंचेरियाल जिले से एक दर्दनाक हादसा सामने आया है। यहां इलेक्ट्रिक शॉक लगने की वजह से दो युवकों की मौत हो गई। जानकारी के मुताबिक दोनों युवक एक पेट्रोल पंप के पास मौजूद थे। इस दौरान यहां एक लोहे का खंभा बिजली की मेन लाइन की तार से टकरा गए। लोहे के खंभे से सटने की वजह से इलेक्ट्रिक शॉक लग गया और दोनों युवक मौके पर ही जल गए। आग में जलने की वजह से युवकों की मौत हो गई। घटना का वीडियो भी सामने आया है, जो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామ మహిళా సోదరిమణులందరూ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ మహిళలు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో శ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు..3