సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు పదో తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికీ వస్తే వారిని విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చిన చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు విశాఖ నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులను సాధించిన ఎలకల హేమంత్ ను విమానంలో విశాఖ నుంచి విజయవాడ తీసుకెళ్ళారు.విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో విశాఖ నుండి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించినట్లు తెలిపిన ఉపాధ్యాయుడు తెలిపారు.విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని దీపం తదితర ప్రాంతాలను విద్యార్థి హేమంత్, టీచర్ కృష్ణారావుతో సందర్శించారు.
సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు పదో తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికీ వస్తే వారిని విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చిన చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు విశాఖ నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులను సాధించిన ఎలకల హేమంత్ ను విమానంలో విశాఖ నుంచి విజయవాడ తీసుకెళ్ళారు.విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో విశాఖ నుండి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించినట్లు తెలిపిన ఉపాధ్యాయుడు తెలిపారు.విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని దీపం తదితర ప్రాంతాలను విద్యార్థి హేమంత్, టీచర్ కృష్ణారావుతో సందర్శించారు.
- కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- పోలీసులు పై ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్.. డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ కడపలో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బిజెపి జిల్లా అధ్యక్షుడు పై చేయి చేసుకున్న డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తులు జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారా అంటూ మాధవ్ పోలీసులు తీరుపై మండి పడ్డారు. డిఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు చేయిచేసుకున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు.1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1