యాదాద్రి భువనగిరి జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల బ్రహ్మకుమారీస్ సెంటర్లో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, వాసవి క్లబ్ భువనగిరి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్చార్జ్ చంద్రకళ మాట్లాడుతూ, మానవులు మాధవులుగా మారే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. స్వర్ణిమ భారతదేశంలోని మౌంట్ అబూ కేంద్రంగా పనిచేస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రపంచంలోని రెండు వందల దేశాలకు పైగా విస్తరించిందని, విశ్వంలోని ఆత్మలందరూ పరంపిత శివ పరమాత్మ సంతానమని, ఆత్మిక స్వరూపంలో అందరూ సోదరీ సోదరులని ఆమె తెలిపారు. పవిత్రత సుఖశాంతులకు జనని అని, బ్రహ్మచర్యం, పవిత్రత ఆధారంగా విశ్వ పరివర్తనకై బ్రహ్మకుమారీలు గత 90 సంవత్సరాలుగా "అవినాశి రుద్రగీతా జ్ఞానయజ్ఞం" నిర్వహిస్తున్నారని చంద్రకళ వివరించారు. బ్రహ్మ కుమారీస్ రామేశ్వర్ మాట్లాడుతూ, ఆత్మ పరమాత్మల సంబంధాన్ని అనుభవం చేసుకోవడమే రాజయోగమని, అన్ని యోగాల్లోకెల్లా రాజయోగం సర్వ శ్రేష్టమైనదని ఉద్ఘాటించారు. రాజయోగ అభ్యాసం చేయాలనుకునే వారికి స్థానిక బ్రహ్మకుమారీ సెంటర్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వాసవి క్లబ్ అధ్యక్షులు లక్ష్మయ్య మాట్లాడుతూ బ్రహ్మకుమారీ సంస్థతో కలిసి యోగా డే నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల సీఈవో దరిపల్లి ప్రవీణ్ కుమార్ మానసిక ఆరోగ్యానికి రాజయోగం, శారీరక ఆరోగ్యానికి యోగాసనాలు, ప్రాణాయామాలు అవసరమని పేర్కొన్నారు. అనంతరం పలు రకాల తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ఎక్సర్సైజులు చేశారు. బ్రహ్మ కుమారీస్ భువనగిరి ఇన్చార్జ్ చంద్రావతి దాదీ మాట్లాడుతూ, రాజయోగం ద్వారానే "విశ్వ పరివర్తన" సాధ్యమని, బ్రహ్మకుమారీస్ సెంటర్లో ఉచిత "రాజయోగ" శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నరుని నారాయణునిగా, నారీని శ్రీ మహాలక్ష్మిగా మార్చడమే బ్రహ్మకుమారీల ఏకైక లక్ష్యమని, పునర్జన్మల కారణంగా మానవుడు కోల్పోయిన దైవీ గుణాలను తిరిగి పొందడం, తమోగుణి కలియుగాన్ని సతోగుణి స్వర్ణిమ యుగంగా మార్చడం కేవలం రాజయోగాభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఎమ్మార్వో మోహన్ రెడ్డి, బికె జహంగీర్ కుమార్, బికె ప్రేమలత, బికె లావణ్య, బికె రాధమ్మ, బికె సుశీల తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల బ్రహ్మకుమారీస్ సెంటర్లో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, వాసవి క్లబ్ భువనగిరి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సెంటర్ ఇన్చార్జ్ చంద్రకళ మాట్లాడుతూ, మానవులు మాధవులుగా మారే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. స్వర్ణిమ భారతదేశంలోని మౌంట్ అబూ కేంద్రంగా పనిచేస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రపంచంలోని రెండు వందల దేశాలకు పైగా విస్తరించిందని, విశ్వంలోని ఆత్మలందరూ పరంపిత శివ పరమాత్మ సంతానమని, ఆత్మిక స్వరూపంలో అందరూ సోదరీ సోదరులని ఆమె తెలిపారు. పవిత్రత సుఖశాంతులకు జనని అని, బ్రహ్మచర్యం, పవిత్రత ఆధారంగా విశ్వ పరివర్తనకై బ్రహ్మకుమారీలు గత 90 సంవత్సరాలుగా "అవినాశి రుద్రగీతా జ్ఞానయజ్ఞం" నిర్వహిస్తున్నారని చంద్రకళ వివరించారు. బ్రహ్మ కుమారీస్ రామేశ్వర్ మాట్లాడుతూ, ఆత్మ పరమాత్మల సంబంధాన్ని అనుభవం చేసుకోవడమే రాజయోగమని, అన్ని యోగాల్లోకెల్లా రాజయోగం సర్వ శ్రేష్టమైనదని ఉద్ఘాటించారు. రాజయోగ అభ్యాసం చేయాలనుకునే వారికి స్థానిక బ్రహ్మకుమారీ సెంటర్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వాసవి క్లబ్ అధ్యక్షులు లక్ష్మయ్య మాట్లాడుతూ బ్రహ్మకుమారీ సంస్థతో కలిసి యోగా డే నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల సీఈవో దరిపల్లి ప్రవీణ్ కుమార్ మానసిక ఆరోగ్యానికి రాజయోగం, శారీరక ఆరోగ్యానికి యోగాసనాలు, ప్రాణాయామాలు అవసరమని పేర్కొన్నారు. అనంతరం పలు రకాల తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ఎక్సర్సైజులు చేశారు. బ్రహ్మ కుమారీస్ భువనగిరి ఇన్చార్జ్ చంద్రావతి దాదీ మాట్లాడుతూ, రాజయోగం ద్వారానే "విశ్వ పరివర్తన" సాధ్యమని, బ్రహ్మకుమారీస్ సెంటర్లో ఉచిత "రాజయోగ" శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నరుని నారాయణునిగా, నారీని శ్రీ మహాలక్ష్మిగా మార్చడమే బ్రహ్మకుమారీల ఏకైక లక్ష్యమని, పునర్జన్మల కారణంగా మానవుడు కోల్పోయిన దైవీ గుణాలను తిరిగి పొందడం, తమోగుణి కలియుగాన్ని సతోగుణి స్వర్ణిమ యుగంగా మార్చడం కేవలం రాజయోగాభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఎమ్మార్వో మోహన్ రెడ్డి, బికె జహంగీర్ కుమార్, బికె ప్రేమలత, బికె లావణ్య, బికె రాధమ్మ, బికె సుశీల తదితరులు పాల్గొన్నారు.
- హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.1
- తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.2
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.1
- 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘాజీపూర్లోని పోలీస్ లైన్లో ఘాజీపూర్ పోలీసులు యోగాను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. ఇరాజ్ రాజా ఐపీఎస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు, ఆరోగ్యకరమైన జీవనం, ఫిట్నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించారు.1
- హైదరాబాద్లోని అత్తాపూర్ వద్ద, పిలర్ నంబర్ 213 సమీపంలో జరిగిన ఒక రోడ్ రేజ్ ఘటన కలకలం రేపింది. ఒక కారు డ్రైవర్ రాంగ్ సైడ్లో తన వాహనాన్ని నడుపుతూ, అనంతరం జరిగిన వాగ్వాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్ రేజ్ వంటి సంఘటనలు నగర రహదారులపై ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.1
- కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.1