Shuru
Apke Nagar Ki App…
Solanke Ravi
More news from Telangana and nearby areas
- పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.4
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు1
- జగిత్యాల జిల్లా… జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- . మాజీ మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి సమాన ఫలాలను అందుకోగలుగుతున్నమ్మన్నారు.ప్రపంచ దేశాలలో సైతం అంబేద్కర్ కు ఘన నివాళులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క 125 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని నివాళులు అర్పించకుండా సంకెళ్లతో బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశా సాధనలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత అభ్యున్నతికి పాటుపడిందన్నారు ఉన్నతమైన విద్యా విధానంతో పాటు దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోయేలా దళిత బస్తీ దళిత బంధు కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు.2
- *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను* అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయబడింది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. _రహదారి భద్రతా ప్రతిజ్ఞ_ నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.1