Shuru
Apke Nagar Ki App…
Solanke Ravi
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi3
- బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మళ్లీ 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మండలంలో రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అదే సమయంలో వేడి గాలులు సైతం వీయడంతో ఉక్క పోత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధాన రోడ్డుతో పాటు చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి.1
- గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.1
- కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిని అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీ కొన్న ప్రభావంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.1
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్పాట్ డెడ్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవే 765 డీ పై బైక్ ఘోర రోడ్డు ప్రమాదం. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్ టీ సీ బస్ డీ కొని ముగ్గురు మృతి. మృతులు హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి కి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తింపు.1
- Post by Solanke Ravi4