బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.1
- మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.1
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డులో రెండు మూడు నెలల నుంచి మురికి కాలువ తీయకపోవడంతో మురికి పేరుకుపోయి దుర్వాసన రావడం జరిగింది అలాగే ఇండ్లలోకి విష కీటకాలు దోమలు వస్తున్నాయని 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి కి వాట్సాప్ చేయగా వెంటనే స్పందించిన ఆయన కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో స్వయంగా వచ్చి దగ్గరుండి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు కాలనీవాసులు మాట్లాడుతూ ఉగాది. రంజాన్ మాసంలో మురికి కాల్వ సమస్య ఉందని చెప్పిన వెంబడే అట్టి సమస్యను తక్షణమే పరిష్కరించిన 20 వార్డ్ కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇందానగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణ్. కల్వకుర్తి మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.1
- హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.1
- విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివిపదవ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు .పదవ తరగతి పరీక్షలు నిమిత్తం విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్. 9848214166. ఏర్పాటుపదవ తరగతి పరీక్షలు విద్యార్థులు మరియు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14.03.2026 నుండి 16.04.2026 వ తేది వరకు నిర్వహణ మొత్తం 68 రెగ్యులర్ సెంటర్ లలో జరగనున్నాయి. మొత్తం 11247 మరియు 100 ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకుహాజరవుతున్నారని చెప్పారు. ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా కోరటమైనది.: ఉదయం 09.30 నుండి 12.30/12.50 PM వరకు జరుగుతుంది,విద్యార్థులు వారికీ కేటాయించిన పరీక్షా కేంద్రమును ఒక రోజు ముందుగా సందర్శించి పరీక్షా ప్రారంభపు తేది రోజు పరీక్షా కేంద్రం చేరుకొనుటకు గల అవాంతరాలను/ ఆలస్యాన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థులకు జారీ చేయబడిన పరీక్షా హాల్ టికెట్ నందు గానీ, OMR షీట్ నందు గానీ ఏవైన ప్రింటింగ్ పొరపాట్లు ఉంటె సంబందిత ఆధార ప్రతులతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పరీక్షా కేంద్రంలోని పరీక్షా నిర్వహణ సిబ్బందికి సూచనలు.పరీక్షా కేంద్రం నకు కేటాయించబడిన సిబ్బంది అందరు గుర్తింపు కార్డ్లను ధరించవలెను. పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణకు కేటాయించబడిన సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం నిషేధించబడిందని చెప్పారు. పరీక్షా కేంద్రంలోని ముఖ్య పరీక్షా పర్యవేక్షకుని అనుమతిలేనిదే ఎవ్వరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని వెల్లడించారు. పరీక్షా కేంద్రంనకు చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 163 B.N.S.S సెక్షన్ అమలులో ఉన్నందున జనం సమూహాలుగా గుమిగూడి ఉండుట నిషేధంఅని చెప్పారు.ఆయా పరీక్షా తేదిలలో ఉదయం 8.00 నుండి సాయంత్రంశ 01.00 గంటల వరకు జీరాక్స్ సెంటర్లు మూసి వుంచవలెను. పరీక్షా కేంద్రం లోకి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్, ఇన్విజిలేటర్, మెడికల్ సిబ్బంది, అటెండర్, వాటర్ బాయ్స్, అభ్యర్థులు మరియు ఇతర పరీక్షా నిర్వహణ సిబ్బంది ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్, పేజర్లు & క్యాలక్యులేటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావడం నిషేధం. అని తెలిపారు. కేంద్రంలో గుర్తించినట్లయితే సంబందికులపై ప్రభుత్వ పరిక్షల మాల్ ప్రాక్టీసు నిరోధక చట్టం 25/1997 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు చేపట్టబడును. అని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏదైనా అత్యవసర సమాచారం తెలియజేయుటకు ఆయా పరీక్షా కేంద్రములకు ఆయా తేదిలలో విధులు కేటాయించబడిన పోలీస్ సిబ్బంది యొక్క ఫోన్ ను మాత్రమే వినియోగించవలెను. వివరించారు. ఇట్టి వినియోగానికి కూడా' కాల్ రిజిస్టర్ నిర్వహించి ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్ ను విధిగా రిజిస్టర్ ఇంతకముందే సరఫరా చేయబడిన పరిక్షల నిర్వహణ-శిక్షణా-కరదీపికలోని సూచనలను పాటిస్తూ సజావుగా పరిక్షల సహకరించవలసినదిగా కోరారు.1