బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన బీసీ జేఏసీ హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు మున్సిపల్ చైర్మన్ లుగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు అవకాశం కల్పించినందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో టిపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాల్లో కౌన్సిలర్లుగా మరియు మున్సిపల్ చైర్మన్ లుగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించి బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించిందనీ.ఒకే బలహీన వర్గాలకు చెందిన బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబట్టే ఇది సాధ్యమైందన్నారు. బీసీల గెలుపు చారిత్రక ఘట్టమన్నారు. బీసీ ఉద్యమాల ఫలితమే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలను అక్కున చేర్చు కున్నాయని అన్నారు. 60 శాతం పైగా పదవులు బీసీలు దక్కించుకోవడం శుభ పరిణామం అని రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపల్ చైర్మన్ ల గాను బీసీలు 64 మంది మున్సిపల్ చైర్మన్ లుగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ స్పందిస్తూ కచ్చితంగా బీసీలకు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి స్వామి బీసీ విద్యార్థి సంఘం, గోదా రవీందర్, నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిని అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీ కొన్న ప్రభావంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.1
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్పాట్ డెడ్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవే 765 డీ పై బైక్ ఘోర రోడ్డు ప్రమాదం. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్ టీ సీ బస్ డీ కొని ముగ్గురు మృతి. మృతులు హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి కి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తింపు.1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️1
- village road 🛣️ Pasthala Nagaram madalam village Pasthala 541
- శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.1
- కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.1
- కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని *కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి* నితిన్ గడ్కారీ గారిని కలిసి విన్నవించిన కామారెడ్డి *శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.1