logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ గోవిందరావుపేట,ఆగస్టు25 : పస్రా పోలీస్‌స్టేషన్‌ను ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులను సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి తదితర అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్, పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

23 hrs ago
user_Madhu
Madhu
కన్నాయిగూడెం, ములుగు, తెలంగాణ•
23 hrs ago
f005bccd-dde5-455f-8877-b20abaa78653

పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ గోవిందరావుపేట,ఆగస్టు25 : పస్రా పోలీస్‌స్టేషన్‌ను ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులను సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి తదితర అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్, పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
    4
    ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన.

ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు మంత్రి సీతక్క.
ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన.
ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు మంత్రి సీతక్క.
మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి  కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు 
ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క  ప్రారంభోత్సవం 
అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు..
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన  మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు.
మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    21 min ago
  • బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
  • సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    1
    సారు.. పింఛను ఇప్పించండి..?*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. 
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
*సెంటర్:- అశ్వారావుపేట*
*స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?*
*యాంకర్ వాయిస్:*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
*వాయిస్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది.
నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది.
*వాయిస్*
నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది.
ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది.
*వాయిస్*
కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు.
*వాయిస్*
నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది.
*వాయిస్ ఓవర్*
నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    1
    స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి
హసన్‌పర్తి:
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
​కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • మధ్యప్రదేశ్‌ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన మగ శిశువు . *మధ్యప్రదేశ్‌:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    1
    మధ్యప్రదేశ్‌ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన
మగ శిశువు
.
*మధ్యప్రదేశ్‌:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    59 min ago
  • రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌ ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి?

మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌
ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా : ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా కృష్ణ కాలనీ శ్రీ మంజునాథపురం 15వార్డులో లో వోల్టేజ్ తో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు, లో వోల్టేజ్ కరెంటు రావడంతో ఫ్యాన్లు,ఫ్రిజ్జులు, టీవీలు, షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోతున్నాయి, కాలనీవాసులందరూ కలిసి స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏఈకి కాలనీవాసులందరూ మరియు ఆవార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మాట్ల సంపత్. గండ్రకోట కుమార్. చుంచు రమేష్. నాగేశ్వరరావు. సుధాకర్. శంకర్. కుమార్. సంపత్. ఇక్బాల్. కాలినివాసులు అందరూ పాల్గొన్నారు.
    2
    ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు.
ములుగు జిల్లా :
ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు.
ములుగు జిల్లా కృష్ణ కాలనీ శ్రీ మంజునాథపురం  15వార్డులో  లో వోల్టేజ్ తో  ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు, లో వోల్టేజ్  కరెంటు రావడంతో  ఫ్యాన్లు,ఫ్రిజ్జులు, టీవీలు, షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోతున్నాయి, కాలనీవాసులందరూ కలిసి  స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏఈకి కాలనీవాసులందరూ  మరియు ఆవార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ కలిసి వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు  మాట్ల సంపత్. గండ్రకోట కుమార్. చుంచు రమేష్. నాగేశ్వరరావు. సుధాకర్. శంకర్. కుమార్. సంపత్. ఇక్బాల్. కాలినివాసులు  అందరూ పాల్గొన్నారు.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.