Shuru
Apke Nagar Ki App…
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
చక్కటి ఆనంద్ కుమార్
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
More news from Telangana and nearby areas
- రిపబ్లిక్ భారతదేశ దౌత్యం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసి, ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను పటిష్టం చేసింది. ఈ పరిణామాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు స్లోవాక్లో చేసిన పర్యటనలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఉన్నాయి.1
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) శనివారం బోథ్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేయగా, నియోజకవర్గ సరిహద్దుల్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నేరడిగొండ మండలంలోని టోల్గేట్ వద్దకు కేటీఆర్ చేరుకోగానే, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన అనుచరులతో పాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేటీఆర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆ తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీగా 'గులాబీ దండు' తరలివచ్చింది, దీంతో నేరడిగొండ టోల్గేట్ వద్ద ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.1
- కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, యూరియా యాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన గంప గోవర్ధన్, రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.1
- జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.1
- బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్ భిక్కు శనివారం నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే వాటన్నింటికీ రైతు భరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వకుండా, త్వరలో విడుదల చేస్తామని తేదీలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలకు ప్రతినిధులు మహబూబ్నగర్కు బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక వాహనాల్లో వారు తరలివెళ్లారు. ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ హాజరవుతున్నట్లు వెంకట్ తెలిపారు. తరలివెళ్లిన వారిలో సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకులు భాస్కర్, సిద్ధిరాములు తదితరులు ఉన్నారు. కామారెడ్డి మండలం నుండి కూడా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఈ మహాసభలకు తరలివెళ్లారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు బలయ్యాడు. పంట కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నుగూరే పాండురంగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరణించిన రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు.1