Shuru
Apke Nagar Ki App…
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
M D Azizuddin
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- విస్తృత స్థాయిలో జనగామ నగరంలో వాటర్ ప్లాంట్ ల తనిఖీ... జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో మున్సిపల్ అధికారులు విస్తృత స్థాయిలో పాల కేంద్రాలను, వాటర్ ప్లాంట్ లను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు.బుధవారం ఉదయం ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈరోజు ఉదయం కొన్ని పాల సెంటర్లను,వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేసి వాటి శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ నుండి వచ్చే రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.1
- విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు సుమారు రెండు గ్రామాలు కలిపి 40 మంది పైగా ప్రతిరోజు జనగాం పోయే ఆర్టీసీ బస్సు రావడం లేదని నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిశారు వారి ఆవేదన చెప్పారు వెంటనే స్పందించి బస్సు వేయాలని ఆర్ఎం జనగామ కోరారు నారాయణపూర్ పోచన్నపేట మీదుగా జనగాం వెళ్లే జనగామ డిపో కు చెందిన RTC బస్ ఉదయం ట్రిప్పు రావడంలేదని స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు లు సుమారుగా రెండు గ్రామాలు కలిపి 40 కి పైబడి విద్యార్థులు ప్రతిరోజు నారాయణపురం పోచన్నపేట గ్రామాల నుండి జనగాం వెళ్లి చదువుకునే వీలుగా ఈ బస్సు ఉండేది కానీ గత నాలుగు రోజుల నుండి ఈ బస్సు రావడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి వారి స్కూళ్లకు మరియు కాలేజీలకు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బస్సు రాకపోవడతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మసూద్ గారి చొరవతో మరియు జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్ ఇట్టి విషయం తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు నష్టం జరగకూడదని ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని జనగామ డిపో మేనేజర్ ఉషా గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి వెంటనే పార్టీ సర్వీస్ను తిరిగి యధావిధిగా అదే టైం కు జనగామ వరకు నడపాలని కోరగా వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు1
- తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.1
- అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్కు చెందిన మెరుగు పవన్ ఆత్మహత్యాయత్నం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్కు చెందిన మెరుగు పవన్ మంగళవారం సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోలింగ్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.1