పెన్షన్ల పంపిణీతో అవ్వాతాతల ముఖాల్లో ఆనందం కప్పలబండలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకలు పుట్టపర్తి అభివృద్ధికి పరిశ్రమలతో కొత్త ఊపు ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని, ప్రతి అవ్వాతాత ముఖంలో ఆనందాన్ని చూడటం ఎంతో సంతోషంగా ఉందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం వృద్ధులు, పేదల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 5వ తరం ఫైటర్ జెట్ యూనిట్ పరిశ్రమ ఏర్పాటు కావడంతో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని అన్నారు.అలాగే త్వరలో ఆమడగూరు ప్రాంతంలో భారీ రిలయన్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుందని, ఈ ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గానికి భారీ పెట్టుబడులు రావడంతో పాటు యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా కప్పలబండ గ్రామంలో టీడీపీ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్లు వలిపి శ్రీనివాసులు, యశోద రాయుడు, సహకార సొసైటీ అధ్యక్షుడు విజయకుమార్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పెద్దన్న, చంద్రశేఖర్, శ్రీనివాసులు, గోపాల్, నారాయణస్వామి, నాగరాజు, మాధవి, రాధా, భాగ్య లావణ్య, మణిమాల, జ్యోతి, శ్యామల తదితర మహిళా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
పెన్షన్ల పంపిణీతో అవ్వాతాతల ముఖాల్లో ఆనందం కప్పలబండలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదిన వేడుకలు పుట్టపర్తి అభివృద్ధికి పరిశ్రమలతో కొత్త ఊపు ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని, ప్రతి అవ్వాతాత ముఖంలో ఆనందాన్ని చూడటం ఎంతో సంతోషంగా ఉందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల
కోట్లకు పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించడం వృద్ధులు, పేదల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 5వ తరం ఫైటర్ జెట్ యూనిట్ పరిశ్రమ ఏర్పాటు కావడంతో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని అన్నారు.అలాగే త్వరలో ఆమడగూరు ప్రాంతంలో భారీ రిలయన్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుందని, ఈ ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గానికి భారీ పెట్టుబడులు రావడంతో పాటు యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జన్మదినం సందర్భంగా కప్పలబండ గ్రామంలో టీడీపీ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్లు వలిపి శ్రీనివాసులు, యశోద రాయుడు, సహకార సొసైటీ అధ్యక్షుడు విజయకుమార్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పెద్దన్న, చంద్రశేఖర్, శ్రీనివాసులు, గోపాల్, నారాయణస్వామి, నాగరాజు, మాధవి, రాధా, భాగ్య లావణ్య, మణిమాల, జ్యోతి, శ్యామల తదితర మహిళా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
- సోమలాపురంలో తాగునీటి వృధాను అరికట్టండి మహాప్రభో అంటున్న ప్రజలు డి హిరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో రోడ్లపై వృధాగా త్రాగునీరు వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటంటూ స్థానికులు పేర్కొన్నారు. వైయస్సార్ విగ్రహం ముందు పైప్ లీకేజీ కారణంగా భారీగా నీరు వృధాగా రోడ్లపై వెళుతోందని పేర్కొన్నారు. సచివాలయం ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలబడటంతో అటుగా వెళుతున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే నీటి వృధా ని అరికట్టాలని వారు కోరుతున్నారు.1
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- గోరింటాకుల ప్రత్యేక అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన నగరేశ్వర కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారు గోరింటాకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురోహితులు మంజునాథ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోరింటాకులతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. మహిళా భక్తాదులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆషాడమాసంలో ప్రత్యేకించి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులను సూచించారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- ఆర్టీసీ డిపో మేనేజర్ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.1