*దేవస్థానం భూమి వివాదం… దాచేపల్లిలో ఉద్రిక్తత* పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నాగమయ్య స్వామి దేవస్థానం భూమి వివాదంగా మారింది. గతంలో హిందూ భక్తులు, అర్చకుల ఉపాధి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు ఎకరం 61 సెంట్ల భూమిని కేటాయించినట్లు సమాచారం. అయితే, ఈ దేవస్థాన భూమిలో కొంత భాగాన్ని గుట్టు చప్పుడు కాకుండా పులిచింతల నిర్వాసితులకు ఆరుగురికి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మరికొంత భూమిని సబ్స్టేషన్ కోసం కూడా కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు గతంలోనే పలుమార్లు ఎమ్మార్వోలకు, అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముత్యాలంపాడు రోడ్డుపై హిందూ సంఘాలు, భక్తులు భారీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. దేవస్థానం భూమిని కాపాడాలని, అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆగ్రహం రోజురోజుకు పెరుగుతుండగా, అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ భూముల రక్షణలో నిర్లక్ష్యం చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. దాచేపల్లి పరిధిలో దేవాలయ భూములపై ఆక్రమణలు, కేటాయింపులపై గతంలోనూ నిరసనలు జరిగినట్లు సమాచారం .
*దేవస్థానం భూమి వివాదం… దాచేపల్లిలో ఉద్రిక్తత* పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నాగమయ్య స్వామి దేవస్థానం భూమి వివాదంగా మారింది. గతంలో హిందూ భక్తులు, అర్చకుల ఉపాధి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు ఎకరం 61 సెంట్ల భూమిని కేటాయించినట్లు సమాచారం. అయితే, ఈ దేవస్థాన భూమిలో కొంత భాగాన్ని గుట్టు చప్పుడు కాకుండా పులిచింతల నిర్వాసితులకు ఆరుగురికి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మరికొంత భూమిని సబ్స్టేషన్ కోసం కూడా కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు గతంలోనే పలుమార్లు ఎమ్మార్వోలకు, అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముత్యాలంపాడు రోడ్డుపై హిందూ సంఘాలు, భక్తులు భారీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. దేవస్థానం భూమిని కాపాడాలని, అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆగ్రహం రోజురోజుకు పెరుగుతుండగా, అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ భూముల రక్షణలో నిర్లక్ష్యం చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. దాచేపల్లి పరిధిలో దేవాలయ భూములపై ఆక్రమణలు, కేటాయింపులపై గతంలోనూ నిరసనలు జరిగినట్లు సమాచారం .
- Post by Syyed taher1
- Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀1
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- Post by SS NEWS1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- Post by Syyed taher1