logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాలువల్లో షిల్ట్ తొలగింపు. . ధర్మవరం పట్టణంలోని శ్రీదేవి టాకీస్ రోడ్, నేసేపేట పెద్ద కాలువ వద్ద షిల్ట్ తొలగింపు పనులను నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పర్యవేక్షించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచన మేరకు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా మోరీని వెడల్పు చేయాలని అధికారులకు సూచించారు.

2 hrs ago
user_LNL
LNL
రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
57af6191-c5be-4f34-bc75-49f33918e4dd

కాలువల్లో షిల్ట్ తొలగింపు. . ధర్మవరం పట్టణంలోని శ్రీదేవి టాకీస్ రోడ్, నేసేపేట పెద్ద కాలువ వద్ద షిల్ట్ తొలగింపు పనులను నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పర్యవేక్షించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచన మేరకు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా మోరీని వెడల్పు చేయాలని అధికారులకు సూచించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.
    1
    రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో  వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ  దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని  ప్రజలు రోగాల బారి నుండి  కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు  అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో   ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు   తదుపరి భక్తులకు అన్న ప్రసాదం  పెట్టారు.
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    1
    ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    2
    కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్..
ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన
చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత
హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు 
చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 

ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 
ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    1
    కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట.......



కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు.
ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్‌.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు. అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. 1. Cr.No.139/2026 01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. 2. Cr.No.140/2026 16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు • రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది. • రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది. • మొత్తం రూ.30,900/- నగదు. • 67 ATM కార్డులు. • ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
    4
    ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది.
దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్‌.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు.
అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు.
అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది.
1. Cr.No.139/2026
01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు.
2. Cr.No.140/2026
16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
• రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది.
• రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది.
• మొత్తం రూ.30,900/- నగదు.
• 67 ATM కార్డులు.
• ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్.
అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు:
మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా.
నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు.
రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి  గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు
రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి  గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.