Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వడ్ల కుప్ప దగ్ధం *జైపూర్ మండలంలోని కనక్కూరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు దుర్గయ్య వడ్ల కుప్ప పూర్తిగా దగ్ధమైంది *విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వడ్ల కుప్ప దగ్ధం *జైపూర్ మండలంలోని కనక్కూరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు దుర్గయ్య వడ్ల కుప్ప పూర్తిగా దగ్ధమైంది. గాలి దుమారానికి కరెంటు తీగలు తెగి వడ్ల కుప్పపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైతు కష్టపడి పండించిన సుమారు 10 క్వింటాళ్ల వరి ధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. కళ్లముందే కష్టం బుగ్గిపాలు కావడంతో బాధిత రైతు దుర్గయ్య కన్నీరుమున్నీరయ్యాడు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.
Thalapalli Ramesh
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వడ్ల కుప్ప దగ్ధం *జైపూర్ మండలంలోని కనక్కూరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు దుర్గయ్య వడ్ల కుప్ప పూర్తిగా దగ్ధమైంది *విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వడ్ల కుప్ప దగ్ధం *జైపూర్ మండలంలోని కనక్కూరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు దుర్గయ్య వడ్ల కుప్ప పూర్తిగా దగ్ధమైంది. గాలి దుమారానికి కరెంటు తీగలు తెగి వడ్ల కుప్పపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైతు కష్టపడి పండించిన సుమారు 10 క్వింటాళ్ల వరి ధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. కళ్లముందే కష్టం బుగ్గిపాలు కావడంతో బాధిత రైతు దుర్గయ్య కన్నీరుమున్నీరయ్యాడు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- कागज़नगर नगर के सर सिल्क क्षेत्र में निर्माणाधीन मकान की दीवार अचानक गिरने से पास के घर में रहने वाली महिला गंभीर रूप से घायल हो गई। स्थानीय लोगों ने तुरंत उन्हें सरकारी अस्पताल पहुँचाया। प्रत्यक्षदर्शियों का कहना है कि निर्माण कार्य के दौरान कोई भी सुरक्षा इंतज़ाम नहीं किए गए थे। कई बार नागरिकों ने अधिकारियों को इस बारे में शिकायत की थी, लेकिन कोई कार्रवाई नहीं हुई। इस घटना के बाद नगर पालिका अधिकारियों पर तीखी आलोचना हो रही है। - बिना पर्याप्त सुरक्षा उपायों के निर्माण की अनुमति कैसे दी गई? - क्या प्रशासन की लापरवाही ही इस हादसे की वजह है? स्थानीय नागरिकों का कहना है कि यदि समय रहते निगरानी की जाती तो यह दुर्घटना टाली जा सकती थी। अब लोग मांग कर रहे हैं कि दोषी अधिकारियों और ठेकेदार पर सख्त कार्रवाई हो।1
- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాయత్రీనగర్ లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి జ్యోతి నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్న మోదీకి ఘనస్వాగతం పలికాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలని కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దామన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.3
- కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు. కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.4
- బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.1
- జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.1
- మందమర్రి.. మందమర్రిలో ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురుస్తుంది. పాలవాగు సమీపంలో ఓ చెట్టు విరిగి ట్రాన్స్ఫార్మర్పై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు రోడ్డుపై పడిపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ విద్యానగర్ కాలనీలో అలుముకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంచికట్ల సంపత్ - మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రీవాత్సవ్ బిల్డింగ్ పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాబు వేసవి సెలవుల నేపథ్యంలో బిల్డింగ్ పై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతోవెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమం గా ఉండడం తో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు రేఫర్ చేశారు. వరంగల్ ఎంజీఎం కు తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీవాత్సవ్ మృతి చెందాడు. బాబు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- హుస్నాబాద్ మండలం పందిళ్ల వంతెన సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి శ్రీరాములపల్లి గ్రామానికి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురిలో భార్య దివ్య తేజ (32), కుమారుడు నిహాన్ రెడ్డి (11) తీవ్రంగా గాయపడగా, భర్త గంగం శ్రీధర్ రెడ్డి (40), కూతురు శ్రీనిక (6) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.1