బోనాల సంబురాల్లో శ్రీభారతి స్కూల్ బోనాలతో ఊరేగింపు.. మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు కోలాటాలు, పోతరాజు, పులి వేషాలతో అలరించిన విద్యార్థులు.. మెట్పల్లి, జూలై 31: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని శ్రీభారతి స్కూల్ ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ కంఠం రమేష్, డైరెక్టర్ కంఠం శివచరణ్, ప్రిన్సిపల్ ఇందూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినీలు సంప్రదాయ వస్త్రధారణలో భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేశారు. డప్పుల చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ బోనాలతో ఊరేగింపుగా స్థానిక మహాలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, పోతరాజు వేషధారణలు, పులి వేషాలు, జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కంఠం రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగను విద్యార్థులతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంప్రదాయాలపై అవగాహన పెరగడంతో పాటు సామాజిక విలువలు, నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి వంటి గుణాలు పెంపొందుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కంఠం భారతి, కంఠం శివచరణ్, అజయ్, పుప్పాల హేమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
బోనాల సంబురాల్లో శ్రీభారతి స్కూల్ బోనాలతో ఊరేగింపు.. మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు కోలాటాలు, పోతరాజు, పులి వేషాలతో అలరించిన విద్యార్థులు.. మెట్పల్లి, జూలై 31: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని శ్రీభారతి స్కూల్ ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ కంఠం రమేష్, డైరెక్టర్ కంఠం
శివచరణ్, ప్రిన్సిపల్ ఇందూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినీలు సంప్రదాయ వస్త్రధారణలో భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేశారు. డప్పుల చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ బోనాలతో ఊరేగింపుగా స్థానిక మహాలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, పోతరాజు వేషధారణలు, పులి వేషాలు, జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు
అందుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కంఠం రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగను విద్యార్థులతో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంప్రదాయాలపై అవగాహన పెరగడంతో పాటు సామాజిక విలువలు, నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి వంటి గుణాలు పెంపొందుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కంఠం భారతి, కంఠం శివచరణ్, అజయ్, పుప్పాల హేమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన శ్రావణ్కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్కుమార్ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam4
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే! అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- రోడ్డుపై మురికి నీటి ప్రవాహం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం అంతా జలమయం అయింది. స్థానిక రామాలయం నుండి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.1