ధర్మవరంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని నిర్వహించి బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరంలో శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని బలిజ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బలిజ కళ్యాణమండపం వద్ద నుండి తెేరు బజార్, అంజుమాన్ సర్కిల్, పిఆర్టి స్టేట్, కళా జ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు కదిరింటి శ్రీరాములు మాట్లాడుతూ.. తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శినికుడు శ్రీకృష్ణదేవరాయులు అని కొనియాడారు. ఆయన పాలన గతించి వందల ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికీ కొనసాగుతుండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరింటి శ్రీరాములు, మాసపల్లి సాయికుమార్, పసుపులేటి కళ్యాణ్, సంకు అఖిల్, ఫణి కుమార్, సంద్రా రమేష్, అరవింద్, గుండ్లపల్లి ధనుంజయ, పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, దాసరి సురేష్, శ్యామ్, మహేష్, లోనుకోట బాబు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని నిర్వహించి బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరంలో శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని బలిజ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బలిజ కళ్యాణమండపం వద్ద నుండి తెేరు బజార్, అంజుమాన్ సర్కిల్, పిఆర్టి స్టేట్, కళా జ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు కదిరింటి శ్రీరాములు మాట్లాడుతూ.. తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శినికుడు శ్రీకృష్ణదేవరాయులు అని కొనియాడారు. ఆయన పాలన గతించి వందల ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికీ కొనసాగుతుండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరింటి శ్రీరాములు, మాసపల్లి సాయికుమార్, పసుపులేటి కళ్యాణ్, సంకు అఖిల్, ఫణి కుమార్, సంద్రా రమేష్, అరవింద్, గుండ్లపల్లి ధనుంజయ, పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, దాసరి సురేష్, శ్యామ్, మహేష్, లోనుకోట బాబు తదితరులు పాల్గొన్నారు.
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.1
- మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.1
- చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో ఘనంగా స్మశాన కొల్ల.. కుప్పం పట్టణంలో అంకాళపరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని బంకమన్నుతో ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు వెలిగించారు. అమ్మవారి ఉత్సవమూర్తికీ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. పదుల సంఖ్యలో భక్తులు రెండు చేతులూ జోడించి పైకెత్తి, వారి ఎదుట మోకాళ్లమీద వరుసగా బారులు తీరారు. దెబ్బదెబ్బకూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. స్మశాన కోళ్లను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.1
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1