గ్రామ అభివృద్ధికి కష్టపడితే కష్టాలేనా? "వాటా ఇస్తేనే బిల్లులు" ఆరోపణలు... వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ సర్పంచ్ ఆవేదన గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామ అభివృద్ధికి కష్టపడితే కష్టాలేనా? "వాటా ఇస్తేనే బిల్లులు" ఆరోపణలు... వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ సర్పంచ్ ఆవేదన గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి
చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
- మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు రామాయంపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రామాయంపేట పట్టణం సంబంధించి బైపాస్ రోడ్డు ధర రామాయంపేట బయట నుండి నిర్మాణం చేయుటకు సర్వేలు కూడా పూర్తి చేశారు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అనేకమంది రైతుల యొక్క సాగు చేయబడే భూములు కోల్పోతూ ఉన్నారు వీటి గురించి అనేకసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది ముఖ్యంగా హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము రోడ్డు వేయుటకు నిధులను మంజూరు చేస్తుంది ఈ రోడ్డుకు భూముల భూములు ఇచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది 13 లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం కానివ్వండి సెక్షన్ 26 కింద భూములు కోల్పోయిన రైతులకు అక్కడి మార్కెట్ రేటు ప్రకారము నూటికి నూరు శాతం డబ్బులు చెల్లించి మాత్రమే భూములు తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెర్ల పెడుతూ రైతులను బెదిరిస్తూ అధికార యంత్రాంగాన్ని మొహరించి ఈ బైపాస్ రోడ్డు గురించి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు కోల్పోతున్న భూములకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తనకు పట్టనట్టు ఇది నేషనల్ హైవే కదా మాకు ఎటువంటి సంబంధం లేదు అని రైతుల దగ్గర మాటలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఒకటి అడుగుతా ఉన్నాం నేషనల్ హైవే ఏసేటప్పుడు దానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది ఆ రోడ్డుకి కావలసిన భూములను సమీకరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మర్చిపోయినట్టున్నారు నేను రైతులను ఒకటే కోరుతా ఉన్నాం మనకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే మాత్రమే ఈ బైపాస్ రోడ్డుకు అంగీకరిద్దాం లేనట్టయితే అడ్డుకుందామని చెప్పేసి కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు వెంటనే స్పందించాలే కలెక్టర్ తో మాట్లాడాలి కన్స అండ్ మినిస్టర్ తో మాట్లాడాలి ముఖ్యమంత్రితో మాట్లాడి రామాయంపేట రైతులకు 2013 చట్టం ప్రకారము 26వ సెక్షన్ ప్రకారము మా రైతులకు వెంటనే మార్కెట్ రేట్ ప్రకారము డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరం నుండి కూడా ఈ బైపాస్ రోడ్డు వ్యవహారం నడుస్తున్న ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ఆగిపోయిన రైతులు నెత్తునూరు మొత్తుకున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారు స్పందించకపోవడం చొరవ చూపకపోవడం కలెక్టర్ తో మాట్లాడకపోవడం సిగ్గుచేటు బాధాకరం ప్రజలకు అందరికీ తెలుసు కోల్పోతున్న రైతులకు కూడా తెలుసు ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి స్థానికంగా మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు వెంటనే స్థానిక రైతులకు నష్టపోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి నష్ట పరివారం ఇప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ రైతులు చాలా పేదవాళ్లు వ్యవసాయ భూములు కోల్పోవడం బాధాకరం అయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వారు సపోర్ట్ చేస్తున్న కనీసం వాళ్లకు పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారు కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ తో కూడా మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఈ రైతులకు మీరు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట ప్రజలందరిని రోడ్డుమీదికి తీసుకువచ్చి నిలదీయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకాడదు భారతీయ జనతా పార్టీ దమ్మెందో కార్యకర్తల దమ్మెందో రామయంపేట ప్రజల దమ్మెందో మేము చూపిస్తాం మా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా వారు వెన్ను అంటూ ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం1
- రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.1
- It is heartbreaking to see innocent birds losing their lives. Pigeons are dying by consuming toxic water from overflowing/open sewage lines. I urge the government to take strict action and fix this drainage problem at the earliest.1
- Based on your query, there appears to be no direct, prominent mattress manufacturer named "Ans Comfort" listed in the Lb Nagar, Hyderabad, area, nor is there a specific, well-known manufacturer operating directly behind the Lb Nagar Kamineni Hospital. You may need to explore nearby, larger mattress retailers in the area. Justdial +1 Key Mattress Information: Location Note: Kamineni Hospital is located on the Inner Ring Road in Lb Nagar. Nearby Options: Other mattress and furniture dealers, such as Urbanrun and Furniture World, operate in that vicinity. Major Brands: Top brands to consider for mattresses in India include Sleepwell, Wakefit, Duroflex, and Kurl-On. Back Support Options: For back pain, options like Nectar Premier Hybrid, Wakefit Latex, and Flo Mattress are often highly recommended. Flo Mattress +6 For precise, local results, it is recommended to search specifically on mapping or business listing platforms for "mattress shops near Kamineni Hospital LB Nagar" to find smaller, independent manufacturers or authorized dealers. Justdial Popular Furniture World near1
- ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...4
- విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.1
- మెదక్ ఎంపీ రఘునాథన్ రావు ఆదేశాల మేరకు విబిజి రాంజీ అనే చట్టానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరుతూ గోడపత్రికను శుక్రవారం బిజెపి కార్యాలయంలో శుక్రవారంమధ్యాహ్నం ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిల రంజిత్ రెడ్డి కల్కి నాగరాజ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ గౌడ్ మెదక్ జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి నల్గాల విజయ్ జిల్లా నగేష్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నూతన ఉపాధి హామీ పథకం గురించి దుష్ప్రచారం నమ్మొద్దు అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం బలపరచాలి వికసిత్ భారత్ లక్ష్యంగా విబిజిరాంజి చట్టానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు. నూతన చట్టం ద్వారా కూలీలకు కూలి పెరుగుతుందన్నారు అవినీతికి తావు లేకుండా ఉంటుందన్నారు.1
- Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and1
- ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం బిజేపికి అడ్డాగా మారింది. కమలం వికాసానికి దిక్సూచిలా పరిణమించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వరుసగా రెండుసార్లు ఎంపిగా కరీంనగర్ నుంచి గెలువడమే కాకుండా తన సత్తా, బిజేపి బలం ఎంటో చూపించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణాకు మార్గదర్శిగా కరీంనగర్ ను నిలబెట్టారు. అంతర్గతంగా రాష్ట్ర బిజేపిలో విబేదాలు, గ్రూప్ రాజకీయాలు ఎన్ని ఉన్నా బండి సంజయ్ మాత్రం ఒంటి చెత్తో కరీంనగర్ ను బిజేపికి అడ్డాగా మార్చారు. రాష్ట్రంలోనే బిజేపి కైవసం చేసుకున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ గా రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రజలే కాదు బిజేపి పెద్దల దృ,ష్టిని ఆకర్శించారు. ఇక తనకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకున్నారు. బండి సంజయ్ అంటే పార్టీలో హాట్ టాఫిక్ గా మారారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సి పల్ కార్పోరేషన్ లు 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పోరేషన్ లో మినహా ఎక్కడ ఆశించిన ఫలితాలు బిజేపికి రాలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం 467 వార్డులు ఉండగా 90 వార్డులను బిజేపి కైవసం చేసుకుంది. అందులో వన్ థర్డ్ అంటే 30 వార్డులను కరీంనగర్ కార్పోరేషన్ లోనే గెలుచుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక పట్టణాలైన ధర్మపురి, మంథని మున్సిపాలిటీల్లో బిజేపి బోని కూడా చేయలేదు. ఇక రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కోక్క స్థానమే గెలుచుకుంది. మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను బిజేపి గెలుచుకున్నప్పటికి ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లభించక తృటిలో రెండు మున్సిపాలిటీలను బిజేపి కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో మొత్తం 27 స్థానాలను బిజేపి కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పోరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 55 వార్డులను బిజేపి గెలుచుకుంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐదుగురు ఇండిపెండెంట్లు బిజేపి లో చేరడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజేపి కార్పోరేటర్ లు కౌన్సిలర్ ల సంఖ్య 60కి చేరింది. నాటకీయ పరిణామాల నేపద్యంలో కరీంనగర్ కార్పోరేషన్ లో బిజేపి జెండా ఎగురవేసింది. 66 డివిజన్ లలో 30 గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజేపి మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండడంతో బిజేపికి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ యత్నించాయి. కూటిమిగా ఏర్పడి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ కు మేయర్ పదవి కట్టబెట్టి బిఆర్ఎస్ డిప్యూటి మేయర్ పొందాలనే ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్ వ్యూహం ముందు కూటమి ప్రయత్నాలు పటాపంచల్ అయ్యాయి. కాంగ్రెస్ కు మేయర్ పీఠం చేజారిపోయి కషాయ దళానికి కార్పోరేషన్ దక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోయినప్పటికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజేపికి కార్పోరేషన్ దక్కడం వెనుక పెద్ద రాజకీయమే జరిగిందట. కూటమి కట్టి కాంగ్రెస్, లేదా ఇండిపెండెంట్ ను మేయర్ ను చేస్తే అక్రమ కలయికను గ్రామగ్రామాన బండి సంజయ్ చాటి చెబుతాడని దీంతో రాబోయే ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందని బావించి, బండి సంజయ్ నోటికి బిఆర్ఎస్ బయపడిందటా. అందుకే మేయర్ ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో బిజేపి విజయాల పరంపర కొనసాగుతుంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ అన్ని తానై వ్యవహరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 121 గ్రామాల్లో బిజేపి మద్దతుదారులు సర్పంచ్ లుగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ చరిత్రలోనే బిజేపి ఓ మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. వికసిస్తున్న కమళంతో కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు బిజేపి లో చేరారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బిజేపి కి ఢోకా లేకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లోనే కమలం వికసించక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కరీంనగర్ మార్క్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు బావిస్తున్నారు. బండి సంజయ్ సంకల్ప బలానికి దైవానుగ్రహం తోడై అద్బుతాలు సాధిస్తామని కాషాయదళం ఆసక్తిగా చర్చించుకుంటుంది. -------1