Shuru
Apke Nagar Ki App…
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం - నాగర్కర్నూల్ డిపో మేనేజర్ నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఉద్యోగుల వ్యక్తిగత ఫిర్యాదులను పరిష్కరించేందుకు మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య వెల్లడించారు. సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో మంగళవారం ఫిర్యాదుల పరిష్కార దినోత్సవంగా నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా మే 12న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, బాధితులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా గానీ లేదా నేరుగా గానీ తెలియజేయవచ్చని కోరారు.
MALLIKARJUN T
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం - నాగర్కర్నూల్ డిపో మేనేజర్ నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఉద్యోగుల వ్యక్తిగత ఫిర్యాదులను పరిష్కరించేందుకు మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య వెల్లడించారు. సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో మంగళవారం ఫిర్యాదుల పరిష్కార దినోత్సవంగా నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా మే 12న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, బాధితులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా గానీ లేదా నేరుగా గానీ తెలియజేయవచ్చని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.1
- తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్ను చూడవచ్చు.1
- పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీ.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని విచారణాధికారి రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, అవసరమైతే మరోసారి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.1
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర. వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.1
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.1