Shuru
Apke Nagar Ki App…
కడుపునొప్పి బాధ తాళలేక మహిళ ఆత్మహత్య, చికిత్స పొందుతూ మహిళ మృతి అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నార్ల దమయంతి (58) అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. దమయంతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోంది. అయినప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.
Sraya
కడుపునొప్పి బాధ తాళలేక మహిళ ఆత్మహత్య, చికిత్స పొందుతూ మహిళ మృతి అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నార్ల దమయంతి (58) అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. దమయంతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోంది. అయినప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు జిన్నారం, ఆగస్టు 27: పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిన్నారం ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆగస్టు 30న జరిగే ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.1
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- మహిళలపై నేను ప్రెస్ మీట్ పెట్టను: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహిళలపై నేను ప్రెస్ మీట్లు పెట్టను మహిళలను కించపరిచేలా నేను మాట్లాడను ఎవరు తప్పు చేశారు అనేది దేవుడు చూస్తున్నాడు మహిళ కంటనీరు ఒక్క చుక్క నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతాం కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది * జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి నిజాంపేట మండలంలోని చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు డాంబర్ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ఏర్పాట్లపై గురువారం ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా రహదారి అధ్వానంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపడుతున్న పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1