Shuru
Apke Nagar Ki App…
మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ.. 230 ఆలయాలకు రూ.76 లక్షల మంజూరు మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 230 ఆలయాలకు మొత్తం రూ.76 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ పండుగల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు.
Kumar Journalist
మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ.. 230 ఆలయాలకు రూ.76 లక్షల మంజూరు మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 230 ఆలయాలకు మొత్తం రూ.76 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సంప్రదాయ పండుగల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- Emotional Appeal: Mother Seeks Missing Son Sheikh Baba Fakhar An emotional appeal has been made by a mother searching for her missing son, Sheikh Baba Fakhar. According to the family, the mother has travelled to Hyderabad in the hope of meeting her son. In her heartfelt message, she requests him to contact her, saying: "My son, wherever you are, please come and meet me once. At least call me or send me a message so I know you are safe. I have come to Hyderabad to see you. Please contact me. I am waiting for you." Anyone with information about Sheikh Baba Fakhar is requested to contact the family.1
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల జోష్లో పోలీసుల తీన్మార్ స్టెప్పులు.. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండో రోజు వేడుకల్లో పోలీసు సిబ్బంది సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత వారం రోజులుగా బోనాల ఉత్సవాల భద్రతా విధుల్లో రాత్రింబవళ్లు నిమగ్నమైన పోలీసులు, అమ్మవారి భవిష్యవాణి, ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా కాసేపు ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా అడుగులు వేస్తూ బోనాల సంబరాల్లో భాగమయ్యారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఓయూ సీఐ మహేష్ కూడా సిబ్బందితో కలిసి నృత్యం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. పోలీసుల ఉత్సాహాన్ని చూసిన భక్తులు చప్పట్లతో అభినందించగా, పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. విధి నిర్వహణతో పాటు పండుగ సంబరాల్లో భాగస్వాములైన పోలీసుల తీరుపై భక్తులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతూ బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుంది అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.. జాగ్రత్తగా ఉండండి నేను సంతోషంగా రాలేదు. క్రోధంతో వచ్చాను నేను చెప్పిన విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలి.. లేదంటే ప్రాణనష్టం జరుగుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత1
- నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మోసం చేసిండు: కేటీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి ఇవ్వలేదని నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప, రెండున్నర సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఆ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కేసీఆర్ 48 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినప్పుడు, మీరు 7 వేల ఉద్యోగాలే ఎందుకు ఇస్తున్నారని అడిగినందుకు వాళ్లను ఎండ్రిన్ తాగి చావండని ముఖ్యమంత్రి అన్నాడు ఇక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేస్తారు? - కేటీఆర్1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- అక్రమ గ్యాస్ రీఫిలింగ్పై ఉక్కుపాదం.. సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు, రీఫిలింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రీఫిలింగ్ కారణంగా అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు లేదా రీఫిలింగ్ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.1
- బోనాల విజయానికి కృషి చేసిన అధికారులకు, వాలంటీర్లకు తలసాని సన్మానం హైదరాబాద్లో సికింద్రాబాద్ నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరను అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించగలిగామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బోనాల సందర్భంగా సేవలందించిన వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాలతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసిన జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, దేవాదాయ, ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ పండితులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు, అలాగే జాతరను విస్తృతంగా ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డెక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్తో పాటు పలువురు నాయకులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.1
- కాప్రా లో భారీ వర్షానికి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయి... మల్కాజిగిరి, సైనిక్పురి, యాప్రాల్, కాప్రా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయి జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు ఏరులను తలపించేలా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగడంతో వాహనాలు బారులుగా నిలిచాయి. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నీరు నిలిచిన ప్రాంతాల్లో సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.1