Shuru
Apke Nagar Ki App…
Katravath Hathiram
More news from తెలంగాణ and nearby areas
- రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎత్తున జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. హోళీ పండుగతో కోడిగుడ్లకు భలే గారాకీ పెరిగింది. రంగులే కాకుండా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులతో పాటు పలు దుకాణాల్లో కోడిగుడ్లు ఖాళీ అయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా హోళీ వేడుకల్లో మునిగి తేలారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీ సందర్భంగా రంగుల్లో మునిగి తేలిన జనం చల్లని పానియాలు.. మద్యంతో విందు భోజనాలు ఆరగించారు. హోళీతో వైన్ షాప్ లు రద్దీగా మారి కొన్ని షాప్ ల్లో స్టాక్ ఖాళీ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని హోళీ సంబరాలతో ఆడిపాడిన యువత, మధ్యాహ్నం నుంచి విందు వినోదాలతో కాలం గడిపారు.4
- Post by వేణు విలేకరి1
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నెహ్రు నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి విశిష్ట అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మెరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను, పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.ఆపద మొక్కులవాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఈ సీతారామాంజనేయుల సాక్షిగా మమ్మల్ని సన్మానించడం తో మా పై మరింత బాధ్యత పెరిగింది అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అంతే కాకుండా గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించడం జరిగింది.కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి పురపాలక సంఘం నుండి ఇంక కూడ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.1
- హైదరాబాద్ నగర పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కార్మికుల మరో వీడియో వైరల్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికులకు, వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. నిర్మాణ సంస్థలు, అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గ్రామంలో నిర్వహించిన రామాయణం, భారతం ప్రవచనాల ప్రభావంతో చిన్నారులు జాజిరి ఆటలలో భాగంగా కోలలు కొడుతూ భక్తి గీతాలు ఆలపించడం విశేషంగా నిలిచింది. చిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక భావాలను ఆచరిస్తూ సంస్కృతి పరిరక్షణకు ముందుకొస్తున్న ఈ బాలబాలికలను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో సనాతన సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.1
- జగిత్యాల జిల్లాలో కోరిక కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేశారు. కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దేవస్థాన ప్రధాన ఆచార్యులు కపింద్ర శర్మ మాట్లాడుతూ ఉదయం 7:30 గంటలకు స్వామివారికి నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారబందనం చేశామని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఉదయం 7:00 గంటల నుంచే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7:00 గంటలకు పుణ్యాహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేపు బుధవారం ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా సర్వదర్శనం మరియు ఆర్జిత సేవలు పునఃప్రారంభం అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.2