logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు ( సచివాలయాల) పరిధిలో పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి గమనిక *🚨 ప్రభుత్వ పథక లబ్ధిదారులకు ముఖ్య సమాచారం 📢* 🏠 *🔹 ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు సమర్పించే సమయంలోనే ఆరు-దశల ధ్రువీకరణ (6-Step Validation)* జరుగుతుంది. 🔹 *దరఖాస్తు సమర్పించే సమయంలో ఉన్న తాజా వివరాలను* అధికారులు సేకరించి ధ్రువీకరిస్తారు. ✅ *📌 ఉదాహరణకు* — ప్రస్తుతం జరుగుతున్న NTR భరోసా పెన్షన్ దరఖాస్తును తీసుకుందాం: 👵 ఒక వృద్ధురాలు NTR భరోసా వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆమె దరఖాస్తు సమర్పించే సమయంలో ఉన్న ఆధార్, కుటుంబం, ఆదాయం, రేషన్ కార్డు తదితర సంబంధిత వివరాల ఆధారంగా ఆరు-దశల ధ్రువీకరణ జరుగుతుంది. *✅ ఉదాహరణకు* సెప్టెంబర్ 16న దరఖాస్తు సమర్పించినప్పుడు ఉన్న వివరాలనే ఆ దరఖాస్తుకు సంబంధించిన ధ్రువీకరణలో పరిగణిస్తారు. ⚠️ ఆ తర్వాత, సెప్టెంబర్ 20న కుటుంబ వివరాల్లో లేదా ఆరు-దశల డేటాలో ఏదైనా మార్పు జరిగినా, సెప్టెంబర్ 16న ఇప్పటికే సమర్పించిన పెన్షన్ దరఖాస్తుకు జరిగిన ధ్రువీకరణపై ఆ మార్పు ప్రభావం చూపదు. 👉 అందుకే *దరఖాస్తు సమర్పించే ముందు మీ ఆధార్, కుటుంబ వివరాలు, రేషన్ కార్డు, ఆదాయం తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా* పరిశీలించుకోండి.

47 min ago
user_BAINA PURUSHOTHAM REDDY
BAINA PURUSHOTHAM REDDY
Agricultural service Nandikotkur, Nandyal•
47 min ago

స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు ( సచివాలయాల) పరిధిలో పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి గమనిక *🚨 ప్రభుత్వ పథక లబ్ధిదారులకు ముఖ్య సమాచారం 📢* 🏠 *🔹 ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు సమర్పించే సమయంలోనే ఆరు-దశల ధ్రువీకరణ (6-Step Validation)* జరుగుతుంది. 🔹 *దరఖాస్తు సమర్పించే సమయంలో ఉన్న తాజా వివరాలను* అధికారులు సేకరించి ధ్రువీకరిస్తారు. ✅ *📌 ఉదాహరణకు* — ప్రస్తుతం జరుగుతున్న NTR భరోసా పెన్షన్ దరఖాస్తును తీసుకుందాం: 👵 ఒక వృద్ధురాలు NTR భరోసా వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆమె దరఖాస్తు సమర్పించే సమయంలో ఉన్న ఆధార్, కుటుంబం, ఆదాయం, రేషన్ కార్డు తదితర సంబంధిత వివరాల ఆధారంగా ఆరు-దశల ధ్రువీకరణ జరుగుతుంది. *✅ ఉదాహరణకు* సెప్టెంబర్ 16న దరఖాస్తు సమర్పించినప్పుడు ఉన్న వివరాలనే ఆ దరఖాస్తుకు సంబంధించిన ధ్రువీకరణలో పరిగణిస్తారు. ⚠️ ఆ తర్వాత, సెప్టెంబర్ 20న కుటుంబ వివరాల్లో లేదా ఆరు-దశల డేటాలో ఏదైనా మార్పు జరిగినా, సెప్టెంబర్ 16న ఇప్పటికే సమర్పించిన పెన్షన్ దరఖాస్తుకు జరిగిన ధ్రువీకరణపై ఆ మార్పు ప్రభావం చూపదు. 👉 అందుకే *దరఖాస్తు సమర్పించే ముందు మీ ఆధార్, కుటుంబ వివరాలు, రేషన్ కార్డు, ఆదాయం తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా* పరిశీలించుకోండి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
    1
    పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను సందర్శించిన నందికొట్కూరు ఎమ్మెల్యే
జూపాడుబంగ్లా(M) పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌లో 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోయి గేటు నీటిలో పడిన ఘటనపై ఎమ్మెల్యే జయసూర్య స్పందించారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. రూ.3 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. పనుల పురోగతిని ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా గేట్ల నిర్వహణ మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    37 min ago
  • వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.
    1
    వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు 
గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
    2
    బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. 
విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి  బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి  మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    4
    పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా 
15.09.2026

 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS.
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. 

ఆత్మకూరు:నంద్యాల జిల్లా.
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS  నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ
వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు
రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన
హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.Nagendrudu
    P.Nagendrudu
    Media company కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 min ago
  • చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
    1
    చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి
చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ,   కే భాస్కర్,  డిమాండ్    
సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి 
చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ,   కే భాస్కర్,  డిమాండ్    
ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు.
ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి
ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు.
గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి
ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.
కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.
    1
    కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు 
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.
    1
    కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించాలి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
నందికొట్కూరు (M) కొణిదెలలో ఉపాధి హామీ పనులను బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు పరిశీలించారు. వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబానికి 200 రోజుల ఉపాధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పొదుపు మహిళల రుణాల రద్దు, పేదలకు ఉచిత నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.