ఓయూలో రక్తదాన శిబిరం నిర్వహించిన బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓయూలో రక్తదాన శిబిరం నిర్వహించిన బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం! గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు. కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్ను రన్వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్గుల్ కి చెందిన కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.4
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad Telangana Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Bai Daismuk Colony Nallakunta Secunderabad ECIL AS Rao Nagar2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 16 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై నమ్మకంతో బి-ఫామ్ అందజేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డికి, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.3
- మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.3
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.1
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV2