Shuru
Apke Nagar Ki App…
పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో బైక్ బోల్తా.. ఇద్దరికి గాయాలు పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో శుక్రవారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జలాల్పూర్కు చెందిన శ్రీను, పోతిరెడ్డిపల్లికి చెందిన సులోచన గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
Sraya
పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో బైక్ బోల్తా.. ఇద్దరికి గాయాలు పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో శుక్రవారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జలాల్పూర్కు చెందిన శ్రీను, పోతిరెడ్డిపల్లికి చెందిన సులోచన గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.1
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కట్టిన బండ కార్తీక చంద్రారెడ్డి. రక్షాబంధన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు. కిషన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమెకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.3
- హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ1
- Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti1
- మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.1
- పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో బైక్ బోల్తా.. ఇద్దరికి గాయాలు పోతిరెడ్డిపల్లి సబ్స్టేషన్ సమీపంలో శుక్రవారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జలాల్పూర్కు చెందిన శ్రీను, పోతిరెడ్డిపల్లికి చెందిన సులోచన గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.1
- మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ నడిరోడ్డుపై కోదాడ సీఐ దాష్టీకం_ హైదరాబాద్, ఆగస్టు 28..దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ1
- నర్సాపూర్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి తలకు తీవ్ర గాయాలు నర్సాపూర్ పట్టణ పరిధిలోని ఫారెస్ట్ ప్రాంతంలో శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బైక్ డివైడర్ను ఢీకొని రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి, గాయపడిన వ్యక్తిని నర్సాపూర్కు చెందిన శివగా గుర్తించారు. వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1