పెద్దమనుషు చాటుకున్న తుష్టి వారి ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా.* ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా తుష్టి వారి పౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ మారేడుమిల్లి మండలంలో బొదు లూరు గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థినిలకు ఆదివాసి సంక్షేమ పరిషత్ (3890/90), వారు తుష్టి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో56 విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్స్ స్కెల్స్ పెనులు అందజేయడం జరిగింది పిల్లలు అందరూ మంచిగ చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (3898/90 నాయకులు బంగారు వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు. అన్నారు పూనెం. చిన్న విరభద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మీరు ఎక్కువ మార్కులతో పాస్ అయితే మూడు బహుమతులు ఇస్తామని అన్నారు ఫస్ట్ బహుమతి 2000 రూపాయలు రెండవ బహుమతి 1000 రూపాయలు 3వ బహుమతి 500 రూపాయలు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బోదులూరు గ్రామ యూత్ లీడర్ వీరవతుల నవకాంత్. ఉపాధ్యాయులు అరుణకుమారి. డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వేశ్వర రావ్ పీడీ లక్ష్మణ్ స్కూల్ టీచర్స్ సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ గురుమూర్తిగారు ఏఎన్ఎం మేడం ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.
పెద్దమనుషు చాటుకున్న తుష్టి వారి ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా.* ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా తుష్టి వారి పౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ వితరణ మారేడుమిల్లి మండలంలో బొదు లూరు గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థినిలకు ఆదివాసి సంక్షేమ పరిషత్ (3890/90), వారు తుష్టి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో56 విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్స్ స్కెల్స్ పెనులు అందజేయడం జరిగింది పిల్లలు అందరూ మంచిగ చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (3898/90 నాయకులు బంగారు వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షులు. అన్నారు పూనెం. చిన్న విరభద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మీరు ఎక్కువ మార్కులతో పాస్ అయితే మూడు బహుమతులు ఇస్తామని అన్నారు ఫస్ట్ బహుమతి 2000 రూపాయలు రెండవ బహుమతి 1000 రూపాయలు 3వ బహుమతి 500 రూపాయలు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బోదులూరు గ్రామ యూత్ లీడర్ వీరవతుల నవకాంత్. ఉపాధ్యాయులు అరుణకుమారి. డిప్యూటీ ప్రధాన ఉపాధ్యాయులు విశ్వేశ్వర రావ్ పీడీ లక్ష్మణ్ స్కూల్ టీచర్స్ సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ గురుమూర్తిగారు ఏఎన్ఎం మేడం ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో గల ఇంటి నెంబర్ 6-76/15 గల నల్లపు రమాదేవి ఇంటిని కిరాయికి తీసుకొని బేకరీనీ నడిపిస్తున్నాను నా వ్యాపారాన్ని చూసి జీర్ణించుకోలేక మా ఇంటి ఓనర్ ఏడుల్ల బయ్యారం గ్రామ పంచాయితీ సెక్రెటరీ జైపాల్ రెడ్డి ని బేకరీ వద్దకు పంపించి మీరు పంచాయతీ అనుమతి లేకుండా ఏ అర్హతతో మీరు షాపు నడుపుతున్నారు అని మీరు బేకరీ ని ఎలా నడుపుతారు నేను చూస్తా మీ అంతు చూడందే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ మాట్లాడినాడు ఇంటి ఓనర్ మరియు పంచాయతీ సెక్రెటరీ నేను ఒక తక్కువ కులం దానినీ అని కులవివక్షతో దుర్భాషలాడుతూ కులం పేరుతో నన్ను దూషించి ఆడపిల్ల అని కూడా చూడకుండా దుష్ప్రదజాలతో నాపై నా భర్త పై నా పిల్లలపై పంచాయతీ వాళ్ళని బేకరీ వద్దకి తీసుకొని వచ్చి దాడి చేసే సమయంలో బేకరీ సెటర్ని మూసివేసి షట్టర్ ముందు నిలబడి ఉండగా గుణపాలతో గొడ్డలితో దాడికి దిగినారు అదే క్రమంలో మేము అడ్డుకోగా పంచాయతీ సెక్రెటరీ నేను ఒక ప్రభుత్వ అధికారిని నాపై చేయి వేస్తారా నన్ను కొడతారా అంటూ మాపై తప్పుడు కేసు పెట్టి నా పిల్లలు చిన్న పిల్లలు అని చూడకుండా మమ్మల్ని భద్రాచలం సబ్ జైలుకి పంపినారు నేను నా భర్త 14 రోజులు రిమాండ్ లో ఉన్నాము మేము జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా బేకరీ షాప్ ని గుణపాలతో పగలగొట్టి బేకరీలో ఉన్న సామాన్లు మరియు విలువైన వస్తువులన్నీ ఇష్టానుసారంగా తీసేసినారు నా బేకరీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి అని పంచాయతీ సెక్రెటరీ గారిని అడగగా మీ సామాన్లు నేను ఇస్తాను నాది పూర్తి బాధ్యత అని మా పై అధికారులకు నా గురించి ఫిర్యాదు చేయవద్దు అని చెప్పి పంచాయతీ గుమస్తాతో తన దగ్గర ఉన్న పాత టీవీని పంపించినాడు పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇలా ఒక ప్రభుత్వ అధికారి అయినా ఏడూళ్ల బయ్యారం పంచాయతీ సెక్రెటరీ కులవివక్షతో తక్కువ కులం దాని అని నూటికి వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా మా షాప్ ని గుణపాలతో పగలగొట్టి దానిలో ఉన్న విలువైన వస్తువులని తీసుకొని మాకు అన్యాయం చేసి నా కుటుంబం మొత్తం రోడ్డుపాలు చేసినారు మాకు జీవన ఉపాధి లేకుండా చేసినారు తక్షణమే ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీసెక్రటరీ జైపాల్ రెడ్డి పై ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను4
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఎన్నికైన పాముల రాజేశ్వరి గారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా రమణారావు గారు మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాముల రాజేశ్వరి గారి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నెటి కిషోర్, వైసీపీ నాయకులు రంగరాజు, వేగిరాజు సాయిరాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, వర్మ, నేలపూడి సుగంధ కుమార్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు, పి. రాజశేఖర్, దంగేటి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- త్వరలో జరగనున్న పదవ తరగతి చివరి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమపాఠశాల పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమపాఠశాల మల్కారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకోవాలని సూచించారు ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు లక్ష్యంతో చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఉపాధ్యాయులతో మాట్లాడిన నేపథ్యంలో పదవతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా ప్రణాళిక ద్వారా వారిని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు4