Shuru
Apke Nagar Ki App…
ప్రజాపాలన దినోత్సవానికి నూతన కలెక్టరేట్ ముస్తాబు...... ములుగులో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణాన్ని అలంకరించడం, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయడం వేగంగా కొనసాగుతోంది.
Karunya
ప్రజాపాలన దినోత్సవానికి నూతన కలెక్టరేట్ ముస్తాబు...... ములుగులో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణాన్ని అలంకరించడం, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయడం వేగంగా కొనసాగుతోంది.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.2
- కార్మికుల పై నిర్భందాన్ని నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.* *2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.* *ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.* ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌.𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏#𝐌𝐀𝐋𝐄][𝐁𝐀3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐀𝐍𝐀𝐌 𝐌𝐎𝐍𝐃𝐀-𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂][𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀-𝐒𝐓𝐀𝐓𝐄#𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃)4
- మడికొండలో కొండచిలువ కలకలం.. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం మడికొండ హైవేపై డీసీసీ బ్యాంక్ పక్కన వేకువజామున భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రద్దీ ప్రాంతంలో పాము రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యార. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అలాగే ఇలాంటి ఘటనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.1
- ప్రజాపాలన దినోత్సవానికి నూతన కలెక్టరేట్ ముస్తాబు...... ములుగులో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణాన్ని అలంకరించడం, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయడం వేగంగా కొనసాగుతోంది.2