కామారెడ్డి జిల్లా టీజీ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి, అదనపు కలెక్టర్ విక్టర్ పత్రిక ప్రకటన. తేది:15.03.2026. కామారెడ్డి జిల్లా ఆదివారం. . జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విక్టర్ ........ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ & జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ ఆదేశాలమేరకు 2026సెన్సస్–2027కు సంబంధించిన దశ–1 గృహ జాబితా, గృహ గణన (HLO) కార్యక్రమం నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి/సబ్ డివిజన్ స్థాయి/ఛార్జ్ స్థాయి అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్ ఆద్వర్యం లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం 2026 మే 11 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు , సూపర్వైజర్ల కు శిక్షణ సందర్భంగా జిల్లా/ఉపజిల్లా అధికారులు, ఛార్జ్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు , ఫీల్డ్ ట్రైనర్లు వంటి జనాభా గణన 2027 విధులకు కేటాయించిన అధికారులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని జిల్లా , సబ్-డివిజనల్ అధికారులు, ఛార్జ్ అధికారులకు లెవల్–1 శిక్షణా కార్యక్రమం 15.03.2026 నుండి 17.03.2026 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం IDOC లోని సమావేశ మందిరంలో 3 రోజులపాటు 15 నుండి 17 వరకు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అదనపు జిల్లా సెన్సస్ అధికారి, సబ్-డివిజనల్ జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ సెన్సస్ అధికారులు , అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఈ శిక్షణలో దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. . ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల గణన ప్రక్రియ ను సమర్దవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు , మౌలిక వసతుల ప్రణాళికలను ఖచ్చితమైన జనగణన గణాంకాలు పునాదిగా ఉంటాయని తెలిపారు. జనాభా గణన ను సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందనిమొదటి దశలో గృహాలు, భవనాలు, కుటుంబ వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాలపరిమితి లో జనాభా గణన ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ..... శిక్షణలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్, RDO వీణ, CPO రఘునందన్, జిల్లాలోని సంబంధిత అధికారులు, తహశీల్దార్లు, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా టీజీ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి, అదనపు కలెక్టర్ విక్టర్ పత్రిక ప్రకటన. తేది:15.03.2026. కామారెడ్డి జిల్లా ఆదివారం. . జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విక్టర్ ........ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ & జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ ఆదేశాలమేరకు 2026సెన్సస్–2027కు సంబంధించిన దశ–1 గృహ జాబితా, గృహ గణన (HLO) కార్యక్రమం నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి/సబ్ డివిజన్ స్థాయి/ఛార్జ్ స్థాయి అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్ ఆద్వర్యం లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం 2026 మే 11 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు , సూపర్వైజర్ల కు శిక్షణ సందర్భంగా జిల్లా/ఉపజిల్లా అధికారులు, ఛార్జ్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు , ఫీల్డ్ ట్రైనర్లు వంటి జనాభా గణన 2027 విధులకు కేటాయించిన అధికారులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని జిల్లా , సబ్-డివిజనల్ అధికారులు, ఛార్జ్ అధికారులకు లెవల్–1 శిక్షణా కార్యక్రమం 15.03.2026 నుండి 17.03.2026 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం IDOC లోని సమావేశ మందిరంలో 3 రోజులపాటు 15 నుండి 17 వరకు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అదనపు జిల్లా సెన్సస్ అధికారి, సబ్-డివిజనల్ జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ సెన్సస్ అధికారులు , అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఈ శిక్షణలో దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. . ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల గణన ప్రక్రియ ను సమర్దవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు , మౌలిక వసతుల ప్రణాళికలను ఖచ్చితమైన జనగణన గణాంకాలు పునాదిగా ఉంటాయని తెలిపారు. జనాభా గణన ను సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందనిమొదటి దశలో గృహాలు, భవనాలు, కుటుంబ వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాలపరిమితి లో జనాభా గణన ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ..... శిక్షణలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్, RDO వీణ, CPO రఘునందన్, జిల్లాలోని సంబంధిత అధికారులు, తహశీల్దార్లు, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- ఇఫ్తార్ విందులు శాంతి ప్రతీకలు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని క్రీస్టల్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సర్వమత సమానత్వానికి కట్టుబడి ఉంటుందని, సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యం. దేవేందర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ లు మల్లికార్జున్ గౌడ్, బట్టి. జగపతి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ కృష్ణ గౌడ్, కౌన్సిలర్ జుబెర్ అహ్మద్, ఖాజా సోహెల్ మోహిద్దీన్, గౌస్, రాజవ్వ,లలిత, స్వరూప,దీపక్ కుమార్, పల్లె రాణి,మైనారిటీ నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- రంజాన్ మాసంలో పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రం క్రిస్టల్ గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ లో భీమేశ్వర ఆలయంలో రాజన్నను భక్తులు దర్శించుకుని ఆలయంలో కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చ్ 15 ప్రజా తెలంగాణ న్యూస్/ డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీల్లో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి రీజినల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లు, క్లబ్ హౌస్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ అధికారులు ఫామ్ హౌస్లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని పేర్కొంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో అనేక దేశాల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ప్రపంచ దేశాలకు టీకాలు అందించి తన సామర్థ్యాన్ని చాటుకుందని ఆయన అన్నారు.పెట్రోలియం, గ్యాస్ సరఫరాల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ బాబురావు, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ, అమర నాగేందర్ తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- కామారెడ్డి సరంపల్లి గ్రామంలో శిదిలవ్యవస్థలో ఉన్న పాఠశాల గదిని కూల్చివేంయించిన HM అనిల్ ఈ సందర్బంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనిల్ సార్ మాట్లాడుతూ... గత 60 సంవత్సరాల క్రితం నిర్మించిన గదిని ఈ రోజు కూల్చివేయ్యటం జరిగిందన్నారు రానున్న వర్షకాలం లో ఏదైనా విపత్తు జరిగితే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులంతా కలిసి తీసుకున్న నిర్ణయనికి సంతోషం వ్యక్తం చేసారు.. త్వరలోనే వంట గదిని ప్రభుత్వ సహకారంతో ప్రారంభం చేస్తామని తెలియచేసారు ఇంకా మిగిలి ఉన్న ప్రహరీ గోడ పాఠశాల గదులకు పెయింట్ వేయించడానికి దాతలు ముందుకు రావాలని సూచించారు... కార్యక్రమంలో ముల్క శ్రీనివాస్ ఆకుల భాస్కర్ గొడుగు శ్రీనివాస్ కొత్తూరీ రాజారాం ఆకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు....1