రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి.. పలమనేరు జనవరి 7( ప్రజా ప్రతిభ) రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రత్నారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలోని ఆ సంఘం కార్యదర్శి గురుమూర్తి శెట్టి అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ స్పందించి సకాలంలో వారికి సంబంధించిన లైఫ్ సర్టిఫిట్లను సంబంధిత అధికారుల వద్ద తగు ఆధారాలతో హాజరై సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫోన్లో వచ్చిన మెసేజ్లను నెట్ సెంటర్ వద్ద ప్రింట్ తీసుకొని భద్రపరచాలన్నారు. వయోభారం ఉన్న పెన్షనర్లకు సంబంధిత ఎస్. టి. ఓ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే డైరీలు, రిపబ్లిక్ దినోత్సవం నిర్వహణ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించాలని, సందర్భంగా కార్య నిర్వహణ బాధితులు గురించి చర్చించుకోవడం జరిగిందన్నారు. కార్యదర్శి గురుమూర్తి శెట్టి మాట్లాడుతూ 2025 సంవత్సరం పెన్షనర్ల వ్యాలిడేషన్ బిల్లు గురించి గుర్తు చేస్తూ ఆనాటి డి ఎస్ నకార చేసిన పోరాటం గురించి రివ్యూ చేసుకోవడం జరిగిందన్నారు. పెన్షనర్లపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ భవిష్యత్తులో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెన్షనర్ల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం సారథ్య వహిస్తుందని గుర్తు చేశారు. దొరస్వామి , ఉమాపతి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలని వాటిని ఎలా ఎదుర్కోవాలో అక్కడ హాజరైన పెన్షనర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు . పన్షనర్లకు అనేక రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం అందించడానికి కృషి చేయాలని అభిప్రాయం చేశారు.ఈ కార్యక్రమంలో సిద్ధ మనోహర్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు ,శ్యామ్ రాజ్, మురళీధర్, వేణుగోపాల్ ,బాలసుబ్రమణ్యం, పురుషోత్తం, రాజారెడ్డి ,కస్తూరి, రషీద్, పాండురంగయ్య ,తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి.. పలమనేరు జనవరి 7( ప్రజా ప్రతిభ) రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సకాలంలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రత్నారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలోని ఆ సంఘం కార్యదర్శి గురుమూర్తి శెట్టి అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ స్పందించి సకాలంలో వారికి సంబంధించిన లైఫ్ సర్టిఫిట్లను సంబంధిత అధికారుల వద్ద తగు ఆధారాలతో హాజరై సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫోన్లో వచ్చిన మెసేజ్లను నెట్ సెంటర్ వద్ద ప్రింట్ తీసుకొని భద్రపరచాలన్నారు. వయోభారం ఉన్న పెన్షనర్లకు సంబంధిత ఎస్. టి. ఓ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే డైరీలు, రిపబ్లిక్ దినోత్సవం నిర్వహణ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించాలని, సందర్భంగా కార్య నిర్వహణ బాధితులు గురించి చర్చించుకోవడం జరిగిందన్నారు. కార్యదర్శి గురుమూర్తి శెట్టి మాట్లాడుతూ 2025 సంవత్సరం పెన్షనర్ల వ్యాలిడేషన్ బిల్లు గురించి గుర్తు చేస్తూ ఆనాటి డి ఎస్ నకార చేసిన పోరాటం గురించి రివ్యూ చేసుకోవడం జరిగిందన్నారు. పెన్షనర్లపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ భవిష్యత్తులో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెన్షనర్ల హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం సారథ్య వహిస్తుందని గుర్తు చేశారు. దొరస్వామి , ఉమాపతి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలని వాటిని ఎలా ఎదుర్కోవాలో అక్కడ హాజరైన పెన్షనర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు . పన్షనర్లకు అనేక రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం అందించడానికి కృషి చేయాలని అభిప్రాయం చేశారు.ఈ కార్యక్రమంలో సిద్ధ మనోహర్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు ,శ్యామ్ రాజ్, మురళీధర్, వేణుగోపాల్ ,బాలసుబ్రమణ్యం, పురుషోత్తం, రాజారెడ్డి ,కస్తూరి, రషీద్, పాండురంగయ్య ,తదితరులు పాల్గొన్నారు
- Post by P.BAVAGI1
- Post by Bondhu Suresh1
- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- 💐శుభాకాంక్షలు 💐1
- తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- Post by Bondhu Suresh1