తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రస్తుతం మనుగడలో ఉన్న 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేలా ఉన్న విద్యా కమిషన్ సిఫారసులను తక్షణమే నిలిపివేయాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోని పెద్దవంగర మండలంలోని బొమ్మకల్, వడ్డే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలల సందర్శనలో భాగంగా నిర్వహించిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మూతపడిన ప్రతి పాఠశాలను తెరిపిస్తామని ప్రకటించి, రెండున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి మాట మార్చారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం మూసిన పాఠశాలలను తెరిపించాల్సింది పోయి, ఏకంగా 23 వేల పాఠశాలలను మూసేసి కేవలం 4 వేల పాఠశాలలకు కుదిస్తామని మాట్లాడడం ముఖ్యమంత్రి నిలకడ లేని తనానికి నిదర్శనమని విమర్శించారు. టీపీఎస్ ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రస్తుతం ఉన్న పాఠశాలలను కొనసాగించాలని, విద్యా కమిషన్ గుర్తించిన 52 అంశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం మాట్లాడుతూ, ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని, విద్యా రంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయించాలని కోరారు. దీంతో పాటు పెండింగులో ఉన్న వివిధ రకాల బిల్లులతో పాటు, 6 డీఏ (DA)లను వెంటనే మంజూరు చేసి, పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య, మండల అధ్యక్షులు చిక్కాల సతీష్, ప్రధాన కార్యదర్శి వల్లాల శ్రీనివాస్, కొండ్లె రమేష్, దయాకర్, లక్ష్మయ్య, కోట వెంకటేశ్వర్లు మరియు యుగంధర్ పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రస్తుతం మనుగడలో ఉన్న 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేలా ఉన్న విద్యా కమిషన్ సిఫారసులను తక్షణమే నిలిపివేయాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోని పెద్దవంగర మండలంలోని బొమ్మకల్, వడ్డే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలల సందర్శనలో భాగంగా నిర్వహించిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మూతపడిన ప్రతి పాఠశాలను తెరిపిస్తామని ప్రకటించి, రెండున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి మాట మార్చారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం మూసిన పాఠశాలలను తెరిపించాల్సింది పోయి, ఏకంగా 23 వేల పాఠశాలలను మూసేసి కేవలం 4 వేల పాఠశాలలకు కుదిస్తామని మాట్లాడడం ముఖ్యమంత్రి నిలకడ లేని తనానికి నిదర్శనమని విమర్శించారు. టీపీఎస్ ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రస్తుతం ఉన్న పాఠశాలలను కొనసాగించాలని, విద్యా కమిషన్ గుర్తించిన 52 అంశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం మాట్లాడుతూ, ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని, విద్యా రంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయించాలని కోరారు. దీంతో పాటు పెండింగులో ఉన్న వివిధ రకాల బిల్లులతో పాటు, 6 డీఏ (DA)లను వెంటనే మంజూరు చేసి, పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య, మండల అధ్యక్షులు చిక్కాల సతీష్, ప్రధాన కార్యదర్శి వల్లాల శ్రీనివాస్, కొండ్లె రమేష్, దయాకర్, లక్ష్మయ్య, కోట వెంకటేశ్వర్లు మరియు యుగంధర్ పాల్గొన్నారు.
- తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ నూతన ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, మరియు పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.2
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.1
- ఖమ్మంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ కోసం కేటాయించిన సమయం ముగిసినప్పటికీ, ఆశించిన మేర జనం రాకపోవడంతో పలుచోట్ల బస్సులు ఖాళీగానే వెనుదిరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ సభకు సంబంధించి మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలను, స్వయం సహాయక సంఘాల సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బలవంతంగా సభకు తరలిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు మరియు సభలో కనిపించిన వెలవెలబాటుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.1
- భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్త పాలకమండలి ఇవాళ కొలువు తీరింది. పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కాగా, ఈ పాలకమండలి నియామకానికి సంబంధించి ఏపీకి చెందిన చిరంజీవి సతీమణిని ఎలా నిర్ణయిస్తారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుమనే యాదగిరిగుట్టలో కొత్త పాలక మండలి ప్రమాణస్వీకార ఉత్సవం జరగగా, చిరంజీవి సతీమణి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.1
- చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.1
- పోక్సో కేసులో నమోదైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో పోక్సో కేసు బాధితురాలు, ఆమె తల్లి తనకు ఫోన్ చేసి తీవ్ర భయాందోళనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని బాధిత కుటుంబం తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో నిందితులు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎదుర్కొంటున్న భయాందోళనలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా దారుణ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయ మరియు పోలీసు వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.1