ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి కౌన్సిలర్స్ గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య మోత్కూరు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ గనగాని శైలజ పన్నాల శ్రీవిద్య అన్నారు ఈరోజు మోత్కూరు పట్టణంలోని సుందరయ్య కాలనీలో గల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వసతి గృహ సంక్షేమ అధికారిని శ్రీమతి వేముల స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థినీలకు బెడ్ షీట్స్ కార్పెట్లు ప్లేట్లు గ్లాసులు తదితర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో విద్యాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు భారీగా పెంచారని నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను నెలకొల్పుతున్నారని వసతిగృహ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడేలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది కామణి అరుణ, విద్యార్థినిలు చైత్ర, గుడిపాటి సిరి సంపద, కొనతం భవాని, సరబోజు రితిక, కమ్మగాని మధుప్రియ, కాటన్ మను దీక్షిత తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి కౌన్సిలర్స్ గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య మోత్కూరు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ గనగాని శైలజ పన్నాల శ్రీవిద్య అన్నారు ఈరోజు మోత్కూరు పట్టణంలోని సుందరయ్య కాలనీలో గల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వసతి గృహ సంక్షేమ అధికారిని శ్రీమతి వేముల స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థినీలకు
బెడ్ షీట్స్ కార్పెట్లు ప్లేట్లు గ్లాసులు తదితర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో విద్యాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు భారీగా పెంచారని నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను
నెలకొల్పుతున్నారని వసతిగృహ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడేలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది కామణి అరుణ, విద్యార్థినిలు చైత్ర, గుడిపాటి సిరి సంపద, కొనతం భవాని, సరబోజు రితిక, కమ్మగాని మధుప్రియ, కాటన్ మను దీక్షిత తదితరులు పాల్గొన్నారు
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగాదేవి గుడి దగ్గర నైట్ నైట్ మట్టి అమ్ముతున్నారు చెరువు మట్టి అమ్ముతున్నారు అమ్మే దొంగలు ఎవరు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాను1
- బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.1