నకిరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థల పతనం: అధికార పార్టీకి 'బానిసలుగా' రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ యంత్రాంగం!* *నకిరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థల పతనం: అధికార పార్టీకి 'బానిసలుగా' రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ యంత్రాంగం!* నకిరేకల్: ఒక నియోజకవర్గ అభివృద్ధికి వెన్నెముకగా ఉండాల్సిన రెవెన్యూ, పంచాయతీ రాజ్, మరియు పోలీస్ శాఖలు నేడు నకిరేకల్లో అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారిపోయాయి. ప్రజల సమస్యలను తీర్చాల్సిన అధికారులు, తమ *కుర్చీలను, పోస్టింగ్లను కాపాడుకోవడమే ధ్యేయంగా* పెట్టుకుని, పాలకపక్షం చెప్పినట్టు ఆడుతున్న 'అక్షరాలా బానిసలు'గా తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ల కోసం 'ఆత్మగౌరవాన్ని' తాకట్టు పెట్టిన అధికారులు ప్రస్తుతం అధికారుల నియామకాలు, బదిలీలు ప్రజాసేవ ప్రాతిపదికన కాకుండా, అధికార పార్టీకి ఎంత విధేయత చూపిస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటున్నాయి. "మాకు కావాల్సిన చోట, మాకు కావాల్సిన వారు ఉండాలి" అన్న అధికార పార్టీ నాయకుల నిబంధనలకు తలొగ్గి, అధికారులు తమ విధి నిర్వహణను పక్కన పెట్టి, పార్టీ ఏజెంట్లుగా మారుతున్నారు. తమ పోస్టింగ్లు సురక్షితంగా ఉండాలంటే, ప్రతిపక్షాలను వేధించాలని, అవినీతికి సహకరించాలని పై నుంచి వస్తున్న ఒత్తిళ్లకు భయపడి, నైతిక విలువలను గాలికొదిలేస్తున్నారు. రెవెన్యూ & పంచాయతీ రాజ్& పోలీస్ అవినీతికి నిలయాలు రెవెన్యూ (MRO): ప్రభుత్వ భూముల పరిరక్షణ, అర్హులైన పేదలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ శాఖ, నేడు రియల్ ఎస్టేట్ మాఫియాకు, అధికార పార్టీ నేతల అక్రమ ఆస్తుల క్రమబద్ధీకరణకు అడ్డాగా మారింది. లంచం ఇస్తేనే ఫైలు కదలడం, పార్టీ నేతల కోసం నిబంధనలు మార్చడం ఇక్కడ పరిపాటి. పంచాయతీ రాజ్ (MDO): గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను అధికార పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మళ్లించడం, కమీషన్ల కోసం పనుల్లో నాణ్యతను విస్మరించడం, ప్రతిపక్ష సర్పంచులు లేదా నాయకులపై కక్షపూరితంగా నిధులు నిలిపివేయడం వంటి చర్యలతో ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్టేషన్లే 'టార్చర్ సెంటర్లు'.. ప్రశ్నిస్తే 'కేసులే' బహుమతులు పోలీస్ వ్యవస్థ తీరు అయితే అత్యంత దారుణం. అధికార పార్టీకి కనీసం మద్దతు పలకని వారిని, ప్రతిపక్ష నేతలను ఏదో ఒక వంకతో పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, గంటల తరబడి నిలబెట్టడం, అధికార పార్టీ నేతల సమక్షంలోనే వారిని అవమానించడం నిత్యకృత్యమైంది. ఫిర్యాదు స్వీకరించరు, కనీసం రశీదు ఇవ్వరు. ప్రతిపక్షాల పిటిషన్లను పక్కన పెట్టి, అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా కేసులు నమోదు చేయడం లేదా ఇతరులపై అక్రమ కేసులు బనాయించడం ద్వారా భయాందోళనకు గురి చేస్తున్నారు. బాధితుల గోస.. బహిర్గతం కానున్న అక్రమాలు కేవలం అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, చట్టాన్ని తన జేబులో పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్న ఈ అధికారులకు త్వరలోనే 'నిజం' రుచి చూపించే సమయం రానుంది. తమ పోస్టింగ్ల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారులు, తాము చేసిన అవినీతి, అక్రమ కేసులు, అధికార పార్టీకి చేసిన వత్తాసుపై సాక్ష్యాధారాలను సేకరించే పనిలో బాధితులు ఉన్నారు. ఉన్నతాధికారులారా, కళ్లు తెరవండి! నకిరేకల్లో జరుగుతున్నది ప్రజా పాలన కాదు, అధికారుల అండతో సాగుతున్న 'అరాచక పాలన'. ఈ వ్యవస్థల పతనాన్ని అడ్డుకోకుంటే, భవిష్యత్తులో ప్రజాగ్రహానికి అధికారులు, పాలకులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజల పక్షాన నిలవాల్సిన యంత్రాంగం, అధికార పార్టీకి కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని, లేనిపక్షంలో మీ అవినీతి చిట్టాలను, అక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థల పతనం: అధికార పార్టీకి 'బానిసలుగా' రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ యంత్రాంగం!* *నకిరేకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థల పతనం: అధికార పార్టీకి 'బానిసలుగా' రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ యంత్రాంగం!* నకిరేకల్: ఒక నియోజకవర్గ అభివృద్ధికి వెన్నెముకగా ఉండాల్సిన రెవెన్యూ, పంచాయతీ రాజ్, మరియు పోలీస్ శాఖలు నేడు నకిరేకల్లో అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారిపోయాయి. ప్రజల సమస్యలను తీర్చాల్సిన అధికారులు, తమ *కుర్చీలను, పోస్టింగ్లను కాపాడుకోవడమే ధ్యేయంగా* పెట్టుకుని, పాలకపక్షం చెప్పినట్టు ఆడుతున్న 'అక్షరాలా బానిసలు'గా తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ల కోసం 'ఆత్మగౌరవాన్ని' తాకట్టు పెట్టిన అధికారులు ప్రస్తుతం అధికారుల నియామకాలు, బదిలీలు ప్రజాసేవ ప్రాతిపదికన కాకుండా, అధికార పార్టీకి ఎంత విధేయత చూపిస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటున్నాయి. "మాకు కావాల్సిన చోట, మాకు కావాల్సిన వారు ఉండాలి" అన్న అధికార పార్టీ నాయకుల నిబంధనలకు తలొగ్గి, అధికారులు తమ విధి నిర్వహణను పక్కన పెట్టి, పార్టీ ఏజెంట్లుగా మారుతున్నారు. తమ పోస్టింగ్లు సురక్షితంగా ఉండాలంటే, ప్రతిపక్షాలను వేధించాలని, అవినీతికి సహకరించాలని పై నుంచి వస్తున్న ఒత్తిళ్లకు భయపడి, నైతిక విలువలను గాలికొదిలేస్తున్నారు. రెవెన్యూ & పంచాయతీ రాజ్& పోలీస్ అవినీతికి నిలయాలు రెవెన్యూ (MRO): ప్రభుత్వ భూముల పరిరక్షణ, అర్హులైన పేదలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ శాఖ, నేడు రియల్ ఎస్టేట్ మాఫియాకు, అధికార పార్టీ నేతల అక్రమ ఆస్తుల క్రమబద్ధీకరణకు అడ్డాగా మారింది. లంచం ఇస్తేనే ఫైలు కదలడం, పార్టీ నేతల కోసం నిబంధనలు మార్చడం ఇక్కడ పరిపాటి. పంచాయతీ రాజ్ (MDO): గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను అధికార పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మళ్లించడం, కమీషన్ల కోసం పనుల్లో నాణ్యతను విస్మరించడం, ప్రతిపక్ష సర్పంచులు లేదా నాయకులపై కక్షపూరితంగా నిధులు నిలిపివేయడం వంటి చర్యలతో ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్టేషన్లే 'టార్చర్ సెంటర్లు'.. ప్రశ్నిస్తే 'కేసులే' బహుమతులు పోలీస్ వ్యవస్థ తీరు అయితే అత్యంత దారుణం. అధికార పార్టీకి కనీసం మద్దతు పలకని వారిని, ప్రతిపక్ష నేతలను ఏదో ఒక వంకతో పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, గంటల తరబడి నిలబెట్టడం, అధికార పార్టీ నేతల సమక్షంలోనే వారిని అవమానించడం నిత్యకృత్యమైంది. ఫిర్యాదు స్వీకరించరు, కనీసం రశీదు ఇవ్వరు. ప్రతిపక్షాల పిటిషన్లను పక్కన పెట్టి, అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా కేసులు నమోదు చేయడం లేదా ఇతరులపై అక్రమ కేసులు బనాయించడం ద్వారా భయాందోళనకు గురి చేస్తున్నారు. బాధితుల గోస.. బహిర్గతం కానున్న అక్రమాలు కేవలం అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, చట్టాన్ని తన జేబులో పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్న ఈ అధికారులకు త్వరలోనే 'నిజం' రుచి చూపించే సమయం రానుంది. తమ పోస్టింగ్ల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారులు, తాము చేసిన అవినీతి, అక్రమ కేసులు, అధికార పార్టీకి చేసిన వత్తాసుపై సాక్ష్యాధారాలను సేకరించే పనిలో బాధితులు ఉన్నారు. ఉన్నతాధికారులారా, కళ్లు తెరవండి! నకిరేకల్లో జరుగుతున్నది ప్రజా పాలన కాదు, అధికారుల అండతో సాగుతున్న 'అరాచక పాలన'. ఈ వ్యవస్థల పతనాన్ని అడ్డుకోకుంటే, భవిష్యత్తులో ప్రజాగ్రహానికి అధికారులు, పాలకులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజల పక్షాన నిలవాల్సిన యంత్రాంగం, అధికార పార్టీకి కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని, లేనిపక్షంలో మీ అవినీతి చిట్టాలను, అక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- హైదరాబాద్ యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్మెంట్లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు వసతి గృహాల్లో పారిశుధ్యం, ఆరోగ్యం, మైనర్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.1