*_చల్లటి కబురు...ఈ నెల 16 నుంచి వర్షాలు_* _తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు._ _ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు._ _ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం అయింది అంటే చాలు.. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు._ *_చల్లటి కబురు...ఈ నెల 16 నుంచి వర్షాలు_* _తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు._ _ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు._ _ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం అయింది అంటే చాలు.. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు._
*_చల్లటి కబురు...ఈ నెల 16 నుంచి వర్షాలు_* _తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు._ _ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు._ _ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం అయింది అంటే చాలు.. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు._ *_చల్లటి కబురు...ఈ నెల 16 నుంచి వర్షాలు_* _తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు._ _ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ నిపుణులు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు._ _ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం అయింది అంటే చాలు.. విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు._
- యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో మిస్మేనేజ్మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్ఆఫీస్ను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- హన్మకొండ:పంట కోత తరువాత పొలాల్లో మంట వేసే రైతుల ప్రవర్తన వల్ల భూమి సారం తగ్గిపోవడం, పంటలకు అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి సమస్యలు నెలకొంటున్నాయి. వాతావరణానికి హానికరమైన కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. కాకపోవాల్సిన ప్రమాదాలపై రైతులలో అవగాహన కల్పించడంలో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి సానుకూలమైన బాధ్యత తీసుకున్నారు. పోలీసులు శాంతి భద్రత కాపాడటం మాత్రమే కాకుండా, ప్రకృతిని రక్షించడంలో కూడా ముందంజ తీసుకుంటే, రైతులకు అవగాహన కల్పించారు . ఈ చర్యల ద్వారా భూమి సారం కాపాడుకోవచ్చు, పంటలకు కావలసిన పోషకాలులభించవచ్చు, వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అందువల్ల ఘాట్ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.2