Shuru
Apke Nagar Ki App…
వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)
SS NEWS
వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.1
- Post by Sampathkumar neerudu1
- పాడేరు మండలం లోచలిపుట్టు గ్రామంలో సోమవారం “రైతన్న సేవలో ప్రభుత్వం – ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీటీడీసీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా మూడవ విడత నగదు పంపిణీ కార్యక్రమం గురించి ఆయన రైతులకు వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.1
- మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు, సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు, *మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు,* ఈ సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మించుచున్నారని, ఇట్టి విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ నగర్ కు చెందిన బొల్లం విజయ తన పేరు మీద మహబూబాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన ఇంటి పట్టా భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసారని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పరిశీలించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. నెల్లికుదురు మండలం శ్రీరాం నగర్ గ్రామం శివారు వెంకటాపూరు కు చెందిన బుర్ర కర్ణాకర్ తాను దివ్యాంగుడినని వికలాంగుల స్కూటి ఇప్పించగలరని కోరారు. కురవి మండల కేంద్రానికి చెందిన నిమ్మల భిక్షం తనకు ఉన్న సర్వే నెంబర్ లో గల భూమి రోడ్డు అని చూపిస్తుందని దానిని సరిచేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకము ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి ( 156 ) వచ్చిన దరఖాస్తులకు సంబందిత అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.1
- విజయనగరం జిల్లా గుర్ల స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఎస్ ఎస్ ఆర్ పేటగ్రామం రైతు పెట్టుబడి సాయం సభకు వచ్చిన స్థానిక MLA కళా వెంకటరావు ను సోమవారం అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- ప్రెస్ నోట్ కోనసీమ రైల్వే పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి… పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ హరీష్ బాలయోగి… లోక్సభలో రైల్వే డిమాండ్స్ పై జరిగిన చర్చలో అమలాపురం ఎంపీ జి. ఎం. హరీష్ బాలయోగి మాట్లాడారు. ఈ సందర్భంగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ పై ప్రత్యేక శ్రద్ధ చూడాలని కోరారు.అలాగే ఆంధ్రప్రదేశ్కు లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రస్తావన 2026–27 సంవత్సరానికి రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన గ్రాంట్లపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ హరీష్ రైల్వే కనెక్టివిటీ బలోపేతం దేశ ఆర్థిక వృద్ధి మరియు ప్రాంతీయ అభివృద్ధికి ఎంత ముఖ్యమో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ ప్రాజెక్ట్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ₹10,134 కోట్లను ఆయన స్వాగతించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కొనసాగించడానికి మెరుగైన రైల్వే కనెక్టివిటీ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ వంటి ప్రధాన పోర్టులతో పాటు దీర్ఘమైన తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రధాన లాజిస్టిక్స్ మరియు ఎగుమతుల కేంద్రంగా ఎదగడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు మరియు అంతర్గత జిల్లాల మధ్య రైల్వే సరుకు రవాణా కనెక్టివిటీ బలోపేతం చేయడం వలన వాణిజ్యం మరియు ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు. లాస్ట్ మైల్ రైల్వే కనెక్టివిటీ ప్రాధాన్యతను వివరించిన ఆయన, ఆంధ్రప్రదేశ్లో ఆమోదం పొందిన పలు రైల్వే ప్రాజెక్టులు — విజయవాడ–గూడూరు, భద్రాచలం–కొవ్వూరు, కర్నూలు–నంద్యాల, గుంతకల్–గుంటూరు వంటి మార్గాలు — ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇవి కనెక్టివిటీ లోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ గురించి మాట్లాడుతూ, ఇది కొనసీమ ప్రాంత ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, పర్యాటకం మరియు స్థానిక పరిశ్రమలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని, అలాగే కొనసీమ ప్రాంతం దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లతో మరింత సమర్థవంతంగా అనుసంధానమవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను మరింత విస్తరించాలని సూచించారు. ఇటీవలి కాలంలో స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచుతున్నాయని ఆయన చెప్పారు. చివరగా, భారతీయ రైల్వేలు దేశ సమగ్రత మరియు ఆర్థికాభివృద్ధికి ఎప్పటినుంచో శక్తివంతమైన శక్తిగా నిలిచాయని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడం ద్వారా రైల్వే అభివృద్ధి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పూర్తిగా అందుతాయని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.1
- Post by Sampathkumar neerudu1
- గిరిజన యువకులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ జగదేశ్వరి అన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రంపచోడవరం గురుకుల పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఎంపిక చేసి కడపలోని స్పోర్ట్స్ స్కూల్లో చదువుతో పాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.1