Shuru
Apke Nagar Ki App…
అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.
Gangamma
అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.1
- *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది. *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.4
- పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.1
- వినాయక చవితి సందర్భంగా కురిసిన వానతో ఆనందంలో రైతులు - ఆహ్లాదంలో పుంగనూరు ప్రజలు. పుంగనూరు, అన్నమయ్య జిల్లా వినాయక చవితి పండగ వేళ పుంగనూరులో కురిసిన చల్లని వర్షంతో పట్టణ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. భక్తితో పాటు ప్రకృతి ఆహ్లాదం తోడవడంతో పండగ వాతావరణం రెట్టింపు అయింది. ఉదయం నుండి వినాయకుడి పూజల్లో నిమగ్నమైన భక్తులకు, సాయంత్రం వేళ కురిసిన చిరుజల్లులు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. చల్లని వాతావరణంలో పిల్లలు, పెద్దలు వీధుల్లో వినాయక మండపాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. "వినాయకుడు వచ్చే వేళ వాన రావడం శుభసూచకం" అంటూ వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా వినాయక చవితి పండగ, వాన జల్లు కలిసి పుంగనూరును ఆహ్లాదకరంగా మార్చాయి.1
- రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్స్టేషన్లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.1
- కుప్పంలో మున్సిపాలిటీ లోని కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానాo దగ్గర గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి కుప్పంలో గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి.. - కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన మైదానంలోని స్టేజ్ పైన గుర్తు తెలియని వృద్ధ సన్యాసి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఘటన స్థలానికి చేరుకుని కుప్పం పోలీస్ వారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం అందించడం జరిగింది.. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మున్సిపాలిటీ వారు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు మాజీ ఎంపిటిసి కృష్ణన్ హరినాథ్ గౌడ్ మదన్ దిలీప్ ఘటన స్థలానికి చేరుకున్నారు . పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తన వద్ద ఉన్న ఒక కాగితంలో తాను చెన్నై శ్రీ పెరంబురుకి చెందిన సోమ సుందరంగా తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తన చిరునామా రాసి ఉన్నట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..2
- పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?1
- పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ వన్ జయశ్రీ బాలాజీ, వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.1