Shuru
Apke Nagar Ki App…
నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన! నాగర్కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో "నషా ముక్త్ భారత్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే. గీతాంజలి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వీడియో సందేశాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత, సామాజిక జీవితాలు నాశనమవుతాయని ప్రధాని హెచ్చరిస్తూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల అధ్యాపకులు హజీరా, ప్రవీణ, దీపిక, సుధాకర్, హుస్సేన్, బిల్కీస్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.
NAVADEEP
నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహన! నాగర్కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో "నషా ముక్త్ భారత్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే. గీతాంజలి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వీడియో సందేశాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత, సామాజిక జీవితాలు నాశనమవుతాయని ప్రధాని హెచ్చరిస్తూ.. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల అధ్యాపకులు హజీరా, ప్రవీణ, దీపిక, సుధాకర్, హుస్సేన్, బిల్కీస్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీశైలం జలాశయం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. సంగమేశ్వరంను చుట్టుముట్టిన వరద జలాలు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఆదివారం ఆరు గంటల సమయానికి జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో 1,74,711 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 846.10. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 72. 1974 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.1
- మహానంది క్షేత్రం లో ఘనంగా ఆషాఢ మాసపు చీరె సారె వేడుకలు మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గరుడనంది నుంచి ప్రారంభమైన శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాడవీధుల గుండా సంకీర్తనలు, కోలాటాలు, భజనలతో సాగిన శోభాయాత్ర అనంతరం శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ, లీలావతమ్మ పర్యవేక్షణలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, శివనామ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- Celebrities who participated in the Banjara Teej festival celebrations *JAC President Jai Kumar, General Secretary & District Joint Secretary of Telangana Rajyadhikari Party Gandra Kamalakar Patel, JAC member Upender, BRS leaders Sainath Goud, Telangana Rajyadhikari Party leaders Sai Kiran, Dhanawat Nayak* and others participated in this program. On this occasion, the organizers, colony elders, women and youth who organized the Teej festival in a grand manner while preserving the Banjara culture and traditions were congratulated. Heartfelt Teej festival greetings to all Banjara brothers and sisters. 🌿🙏1
- *బంజారా తీజ్ పండుగ ఉత్సవాల్లో ఘనంగా పాల్గొన్న ప్రముఖులు* ఈ కార్యక్రమంలో *జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జై కుమార్ గారు, జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ గండ్ర కమలాకర్ పటేల్ గారు, జేఏసీ సభ్యులు ఉపేందర్ గారు, బీఆర్ఎస్ నాయకులు సాయినాథ్ గౌడ్ గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు సాయి కిరణ్ గారు , ధనావత్ నాయక్ గారు,* కాలనీ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని బంజారా సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, *బంజారా సమాజం తమ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని* పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. *ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆత్మీయంగా ఆతిథ్యం అందించిన తీజ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీ రెడ్డి నాయక్ గారు, శ్రీ భద్రి నాయక్ గారికి మరియు ధనావత్ నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ పెద్దలకు, కమిటీ సభ్యులకు, మహిళలకు, యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.* *బంజారా సంస్కృతి చిరస్థాయిగా వెలుగొందాలని, తీజ్ పండుగ ప్రతి కుటుంబానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బంజారా సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక తీజ్ పండుగ శుభాకాంక్షలు. 🙏🌿*1
- తుంగభద్ర ZPH స్కూల్లో మాధవరం పోలీసుల అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన1
- రాయలసీమలో పంటలను కాపాడాలి: సీపీఐ యం ఎల్ నేత వెంకటేశ్వర్లు శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులు ఉందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్యాల హంద్రీనీవా, ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసి రాయలసీమ రైతుల పంటలను కాపాడాలని కోరారు. ఇప్పటికే ఖరీఫ్లో సాగుచేసిన పంటలు ఎండిపోయాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని కోరారు.1