కార్పొరేట్లకు ‘రాయితీలు’... సామాన్యుడిపై ‘ధరల’ గుదిబండ : సి పి ఎం సత్తుపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల పన్ను రాయితీలు, ఉచిత భూములు, సబ్సిడీలు కల్పిస్తూ.. సామాన్య ప్రజలపై మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రూపంలో మోయలేని భారాలను మోపడం దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు విమర్శించారు. సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి పోలిక పోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాండురంగారావు మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకరించే ప్రమాదకర విధానాలను ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేయడం ప్రజావ్యతిరేక చర్య అని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఒకప్పుడు సులభంగా చదువుకునే పరిస్థితి ఉండేదని, నేడు విద్యను కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను వెంటనే నియంత్రించి, కార్పొరేట్ విద్యా దోపిడీ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని పాండురంగారావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, చెరుకు రత్నకుమారి గుదే రాము, చప్పిడి భాస్కర్ చెరుకు శ్రీనివాస్, పుష్పవల్లి, వెంకటేశ్వరరావు,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు ‘రాయితీలు’... సామాన్యుడిపై ‘ధరల’ గుదిబండ : సి పి ఎం సత్తుపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల పన్ను రాయితీలు, ఉచిత భూములు, సబ్సిడీలు కల్పిస్తూ.. సామాన్య ప్రజలపై మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రూపంలో మోయలేని భారాలను మోపడం దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు విమర్శించారు. సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి పోలిక పోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాండురంగారావు మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకరించే ప్రమాదకర విధానాలను ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేయడం ప్రజావ్యతిరేక చర్య అని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఒకప్పుడు సులభంగా చదువుకునే పరిస్థితి ఉండేదని, నేడు విద్యను కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను వెంటనే నియంత్రించి, కార్పొరేట్ విద్యా దోపిడీ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని పాండురంగారావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, చెరుకు రత్నకుమారి గుదే రాము, చప్పిడి భాస్కర్ చెరుకు శ్రీనివాస్, పుష్పవల్లి, వెంకటేశ్వరరావు,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
- గ్రీన్ఫీల్డ్పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను – భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ1
- రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్ ఖమ్మం: రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- మేడ్చల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1