*డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్..!!* *బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు* *డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్..!!* *బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు* బెంగళూరు :- వారంతా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు. అంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వయసువారే. విలాసాలకు అలవాటు పడిన వీరు డబ్బు కోసం క్లాస్మేట్నే కిడ్నాప్ చేశారు. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ విద్యార్థి కిడ్నాప్ వ్యవహారాన్ని మడివాళ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆగ్నేయ విభాగ డీసీపీ ముహమ్మద్ సుజీత సోమవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఆదిత్యభోస్లే, శౌర్య అగర్వాల్, నిక్కు సుల్తాని, సయ్యద్ మొహమ్మద్ బిలాల్ విలాసాలకు అలవాటుపడ్డారు. నలుగురూ కూడబలుక్కుని తమ సహ విద్యార్థి మహంతిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ వేశారు. శనివారం రాత్రి హాస్టల్ వద్ద కారు సిద్ధం చేసుకున్నారు. మహంతి రాగానే అందు లో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఓ గదిలో బంధించారు. రూ.50వేలిస్తే వదిలేస్తామన్నారు. ఆ విద్యార్థి.. తన మిత్రుడికి ఫోన్ చేసి రూ.10వేలు యూపీఐ ద్వారా జమ చేయించారు. డబ్బులు పంపిన మిత్రుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా వారున్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి నకిలీ మెటల్గన్, కారును స్వాధీనం చేసుకున్నారు.
*డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్..!!* *బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు* *డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్..!!* *బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు* బెంగళూరు :- వారంతా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు. అంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వయసువారే. విలాసాలకు అలవాటు పడిన వీరు డబ్బు కోసం క్లాస్మేట్నే కిడ్నాప్ చేశారు. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ విద్యార్థి కిడ్నాప్ వ్యవహారాన్ని మడివాళ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆగ్నేయ విభాగ డీసీపీ ముహమ్మద్ సుజీత సోమవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఆదిత్యభోస్లే, శౌర్య అగర్వాల్, నిక్కు సుల్తాని, సయ్యద్ మొహమ్మద్ బిలాల్ విలాసాలకు అలవాటుపడ్డారు. నలుగురూ కూడబలుక్కుని తమ సహ విద్యార్థి మహంతిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ వేశారు. శనివారం రాత్రి హాస్టల్ వద్ద కారు సిద్ధం చేసుకున్నారు. మహంతి రాగానే అందు లో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఓ గదిలో బంధించారు. రూ.50వేలిస్తే వదిలేస్తామన్నారు. ఆ విద్యార్థి.. తన మిత్రుడికి ఫోన్ చేసి రూ.10వేలు యూపీఐ ద్వారా జమ చేయించారు. డబ్బులు పంపిన మిత్రుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా వారున్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి నకిలీ మెటల్గన్, కారును స్వాధీనం చేసుకున్నారు.
- పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.1
- Post by Nageshwari Nageshwari4
- ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Rajinikanth1
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- *ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* *అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్* భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..1
- విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1