చిరస్మరణీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్. పలమనేరు ఏప్రిల్ 14( ప్రజా ప్రతిభ) భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మరువరాని ముద్ర వేసుకున్న చిరస్మరణీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరేనని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, జిల్లా కార్యదర్శి చిలకమ్మ, జిల్లా గౌరవ అధ్యక్షులు మణి, మహిళా నాయకురాలు సరస్వతి, యువజన సంఘం నాయకులు సోమశేఖర్, డప్పు కళాకారుల సంఘం నాయకులు గుర్రం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేర్ పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మున్సిపల్ కార్మిక నాయకులు రమేష్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబా సాబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలకు గురై మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో తనకంటూ చెరపరాని ముద్ర వేసుకున్న మహా మేధావి అని కొనియాడారు. వివిధ దేశాల్లో చదువుకుంటూ అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి భారతదేశంలో కూడా అలాంటి వాతావరణం ఉండాలని అహర్నిశలు కృషిచేసిన కృషివళుడని కొనియాడారు. రాజ్యాంగంలో భారతదేశ ప్రజలకు హక్కులు ,చట్టాలు, పరిపాలన విధానం, న్యాయవ్యవస్థ, రిజర్వేషన్లు ప్రస్తావించకుండా ఉండి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు ఏమైపోయేవో నని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానుకో ఉపయోగపడే వ్యక్తి కాదని సమాజానికి మహా శక్తిని ఇచ్చిన ప్రపంచ మేధావి అని పేర్కొన్నారు. అంగన్వాడి యూనియన్ నాయకురాలు నాగరత్న మాట్లాడుతూ ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు, వర్ధంతలు చేసి చేతులు దులుపుకునే దాని కన్నా ఆయన ఆలోచన విధానాలను ముందుకు కొనసాగించి చట్టాలు తెలుసుకొని హక్కులు సాధించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీల గొడుగుల కింద ఉండే బహుజన నాయకులు ముందుకొచ్చి రాజకీయ, కుల వివక్ష, అంటరానితనం, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందక వెనుకబడిన వారిని భుజం తట్టి నడిపించాలన్నారు. అప్పుడే బాబా సాహెబ్ అంబేద్కర్ కు ప్రజలు ఇచ్చే గొప్ప బహుమతి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద, అమానుల్లా, సూర శ్రీనివాసులు, నారాయణ శెట్టి, సాంబశివ, లక్ష్మమ్మ, మారక్క, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్. పలమనేరు ఏప్రిల్ 14( ప్రజా ప్రతిభ) భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మరువరాని ముద్ర వేసుకున్న చిరస్మరణీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరేనని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, జిల్లా కార్యదర్శి చిలకమ్మ, జిల్లా గౌరవ అధ్యక్షులు మణి, మహిళా నాయకురాలు సరస్వతి, యువజన సంఘం నాయకులు సోమశేఖర్, డప్పు కళాకారుల సంఘం నాయకులు గుర్రం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేర్ పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మున్సిపల్ కార్మిక నాయకులు రమేష్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబా సాబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలకు గురై మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో తనకంటూ చెరపరాని ముద్ర వేసుకున్న మహా మేధావి అని కొనియాడారు. వివిధ దేశాల్లో చదువుకుంటూ అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి భారతదేశంలో కూడా అలాంటి వాతావరణం ఉండాలని అహర్నిశలు కృషిచేసిన కృషివళుడని కొనియాడారు. రాజ్యాంగంలో భారతదేశ ప్రజలకు హక్కులు ,చట్టాలు, పరిపాలన విధానం, న్యాయవ్యవస్థ, రిజర్వేషన్లు ప్రస్తావించకుండా ఉండి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు ఏమైపోయేవో నని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానుకో ఉపయోగపడే వ్యక్తి కాదని సమాజానికి మహా శక్తిని ఇచ్చిన ప్రపంచ మేధావి అని పేర్కొన్నారు. అంగన్వాడి యూనియన్ నాయకురాలు నాగరత్న మాట్లాడుతూ ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు, వర్ధంతలు చేసి చేతులు దులుపుకునే దాని కన్నా ఆయన ఆలోచన విధానాలను ముందుకు కొనసాగించి చట్టాలు తెలుసుకొని హక్కులు సాధించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీల గొడుగుల కింద ఉండే బహుజన నాయకులు ముందుకొచ్చి రాజకీయ, కుల వివక్ష, అంటరానితనం, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందక వెనుకబడిన వారిని భుజం తట్టి నడిపించాలన్నారు. అప్పుడే బాబా సాహెబ్ అంబేద్కర్ కు ప్రజలు ఇచ్చే గొప్ప బహుమతి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద, అమానుల్లా, సూర శ్రీనివాసులు, నారాయణ శెట్టి, సాంబశివ, లక్ష్మమ్మ, మారక్క, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
- ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Rajinikanth1
- *ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* *అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్* భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..1
- Post by Nageshwari Nageshwari4
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- Post by Palakattu nagendra1
- విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1