*గ్రాడ్యుయేషన్ డే రేపటి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక తొలి అడుగు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా* పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: 8వ పోషణ్ పక్వాడా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార స్టాల్లను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్న ఆయన, పోషణ్ పక్వాడా ఉద్దేశాలను వివరిస్తున్న తీరును అభినందించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకమని, పోషణ్ పక్వాడా వంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడానికి దోహదపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులకు పునాది దశలోనే మంచి అలవాట్లు, సరైన ఆహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. నేటి గ్రాడ్యుయేషన్ డే కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక తొలి అడుగు అని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సిడిపిఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం అధికారులు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*గ్రాడ్యుయేషన్ డే రేపటి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక తొలి అడుగు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా* పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: 8వ పోషణ్ పక్వాడా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార స్టాల్లను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్న ఆయన, పోషణ్ పక్వాడా ఉద్దేశాలను వివరిస్తున్న తీరును అభినందించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లల
శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకమని, పోషణ్ పక్వాడా వంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడానికి దోహదపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులకు పునాది దశలోనే మంచి అలవాట్లు,
సరైన ఆహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. నేటి గ్రాడ్యుయేషన్ డే కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక తొలి అడుగు అని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సిడిపిఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం అధికారులు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.1
- Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని వెల్కమ్ హోటల్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.3
- सामेला पाड़ला, बागरा भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया। --- 🔥 घटना का विवरण - पटाखों की चिंगारी से टेंट में आग लगी। - मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए। - प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया। - गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई। --- ⚠️ सीख और सावधानी - शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए। - टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है। - ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं। --- 📣 समाज बंधुओं से निवेदन 👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।” 👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।” 👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- ఆదిలాబాద్ పట్టణంలో రయ్యడి సామ చిన్న గంగారెడ్డి బిడ్డ పెండ్లి,సాయి లింగి తోట శ్రీనివాస్ బిడ్డ పెండ్లికి,దేవాపూర్ గొనె అనిల్ పెండ్లి,వాడ్డుర్ దేవాన్నా యాదవ్ తమ్ముని బిడ్డ పెండ్లి,బొల్లారపు బాబన్న Ex జడ్పీటీసీ మనుమని నామకరణ కార్యక్రమానికి,కాంగ్రెస్ నాయకుడు శ్రావన్ నాయక్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. ఈ కార్యక్రమలో వెంకన్నయాదవ్, మాజీ ఎంపీటీసీ డి.పొచ్చన్న సర్పంచ్,మోహన్,కే ప్రతాప్ తదిరులు పాల్గొన్నారు1