Shuru
Apke Nagar Ki App…
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ రోజు శాసన మండలి సమావేశాలలో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను గత 15ల కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కనీసం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో మాట్లాడినందుకు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC గారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను జర్నలిస్టుల సంఘాల నేతలు.
Sagaboina Paparao
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ రోజు శాసన మండలి సమావేశాలలో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను గత 15ల కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కనీసం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో మాట్లాడినందుకు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC గారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను జర్నలిస్టుల సంఘాల నేతలు.
More news from తెలంగాణ and nearby areas
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్ గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Ali ammu1
- నాగర్ కర్నూలు జిల్లా అంకిరోనిపల్లి మహిళా సర్పంచ్ కుటుంబం పై జరిగిన దాడిని గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మహిళా సర్పంచ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరగడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి ఆమె కుటుంబం పై దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఛలో అంకిరోనిపల్లి కి పిలుపునిస్తామని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.2
- WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 18 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుద్ధ నారాయణ మెట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం, బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈనెల అమావాస్య రోజున బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బుద్ధ అన్నపూర్ణ, శంకరయ్య, బుద్ద శివ, కొమరవెల్లి సుధాకర్,రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్,కైలాస ప్రశాంత్,రమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.1
- ఈ రోజు శాసన మండలి సమావేశాలలో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను గత 15ల కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కనీసం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల పక్షాన శాసనమండలిలో మాట్లాడినందుకు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు MLC గారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను జర్నలిస్టుల సంఘాల నేతలు.1