Shuru
Apke Nagar Ki App…
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 19వ డివిజన్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మినీ లారీ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, మేకల రవీంద్ర, చందనపు నాగరాజు, సయ్యద్ షర్బుద్ధిన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SHOT NEWS
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 19వ డివిజన్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మినీ లారీ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, మేకల రవీంద్ర, చందనపు నాగరాజు, సయ్యద్ షర్బుద్ధిన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- దివంగత మహానేతవై.యస్.రాజశేఖర్ రెడ్డికి పాలాభిషేకం చేసిన అభిమానులు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం ఇబ్రహీంపట్టణం మండలం, కాచవరం గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొని దివంగత మహానేతవై.యస్.రాజశేఖర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. వై.యస్.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం జరిగింది.1
- రేపల్లెలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. తెలుగు ప్రజల గుండెచప్పుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రేపల్లె పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. రేపల్లె వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో రేపల్లె బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పీటా నాగమోహన్ కృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ చేసిన సేవలను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అజరామరం అన్నారు. తన పరిపాలనతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు పూయించిన మహానాయకుడు అన్నారు. సంక్షేమ పథకాలంటే గుర్తుకువచ్చే ఏకైక పేరు వైఎస్సార్. నిరుపేదల ఆకలి తీర్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్సార్కు అంజలి ఘటించారు.1
- కృష్ణాజిల్లా పెడనలో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ పుట్టిన రోజు వేడుకలు ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ మాట్లాడుతూ మారుమూల, కొండల ప్రాంతాలలో రోడ్లు,మంచినీటి సదుపాయం కల్పించారని,పెడన నియోజకవర్గం లోనే 20 కోట్లు పైనే పంచాయతీ సీసీ రోడ్లు వేయించిన ఘనత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిదే అని తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ జెన్ జి అనే కార్యక్రమన్ని స్థాపించారాని తెలిపారు. యువత కోసం జై కొట్టు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది అని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అరవై వేలు సభ్యత్వాలు ఉన్నపటికీ, ఇప్పుడు ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు సభ్యత్వాలు ప్రాంతీయ పార్టీ కి విజయానికి నాంది అని, అలాగే రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఘన విజయం సాధించటానికి ప్రతి ఒక్క కార్యకర్త జై కొట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.1
- 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.పాలేరు రిజర్వాయర్ లో నీళ్లను ఇక్కడ రైతులకు సాగు నీటి కోసం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.త్రాగునీటి కోసం మరోసారి సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన అన్నారు.ఒక్క పంటకైనా నీరు ఇవ్వకుండా రైతులను అన్యాయం చేయొద్దన్నారు. పాలేరు ప్రజలు మరొకసారి మోసపోవద్దని ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేస్తానని ఆయన తెలిపారు1
- *నరసరావుపేట లో లోకేష్ పర్యటన* SHOT News:నర్సరావుపేట రూరల్ ఉప్పలపాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్కు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టగా, అభిమానులు పూలవర్షం కురిపించారు.1
- పాయకరావుపేటలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాయకరావు పేట క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు పోలవరం ఎడమ కాలువలోనే నిల్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు.గోదావరి జలాలకు పుష్పాలు సమర్పించి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ తదితరులు పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకుని అందరికీ చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు1
- 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది.తెల్లవారుజామున పైనంపల్లి, తదితర గ్రామాల్లో అరగంట పాటు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి పడిన ఈ వర్షం పంట పొలాలకు ఊపిరిపోసి ప్రాణం పోసిందని, వర్షాభావ పరిస్థితుల నుంచి పైర్లను కాపాడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.1
- ◼️ఆగస్టు 26న సంభవించిన వరదలకు సంబంధించిన CCTV దృశ్యాలను చూడండి. ఎంత అకస్మాత్తుగా, ఎంత ఉగ్రంగా భారీ వరద ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందో ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.1