Shuru
Apke Nagar Ki App…
రోడ్డెక్కిన 3000 మంది .. కారణమిదే! చందానగర్లోని పీజేఆర్ కాలనీ, అపర్ణ హిల్ పార్క్, సిలికాన్, గార్డెనియల్ నివాసితులు రోడ్డు సమస్యపై భారీ నిరసన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఏళ్ల తరబడి నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Journalist Prem
రోడ్డెక్కిన 3000 మంది .. కారణమిదే! చందానగర్లోని పీజేఆర్ కాలనీ, అపర్ణ హిల్ పార్క్, సిలికాన్, గార్డెనియల్ నివాసితులు రోడ్డు సమస్యపై భారీ నిరసన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఏళ్ల తరబడి నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు1
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- పెనుగంచిప్రోలులో ఘనంగా రంగుల మహోత్సవం నందిగామ టీవీ న్యూస్ : శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారీ రంగుల మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామంలోని రంగుల మండపం వరకు అమ్మవారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రంగుల మండపం వద్ద అమ్మవారి విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- ఆర్వీ నగర్లో అగ్నిప్రమాదం: నిక్కుల సావిత్రి ఇల్లు పూర్తిగా దగ్ధం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కూటమి నాయకులు – ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం పరిధిలోని స్థానిక ఆర్వీ నగర్ గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నిక్కుల సావిత్రి నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారగా, ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్తువులు, కొంత నగదు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే బాధిత కుటుంబం నివాసం కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే కూటమి నాయకురాలు పసుపులేటి నాగమణి, పార్టీ నాయకులు అంజి, రాజారావు, పీసా కమిటీ సభ్యులు పండా నీలకంఠం, గ్రామస్తులు, గ్రామ పెద్దలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిక్కుల సావిత్రికి తక్షణమే ప్రభుత్వ సహాయం అందించి న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు.ఇలాంటి అగ్నిప్రమాదాల వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.1
- బాన్సువాడ మున్సిపల్ పరిధి లో దొంగ ఓట్ల కలకలం..... బాన్సువాడ ప్రతినిధి బాన్సువాడ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ఉన్న దొంగ ఓట్లను తొలగించి, పట్టణంలో నివాసం ఉన్న వారికే ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి, ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలక్టర్ కిరణ్మయికి మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మాజీ ఎంపిటిసి దాకాయ్య బిజెపి కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ అనిల్ శివశంకర్. నసురాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్ బిజెపి నాయకులు చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి కొండని గంగారం తోటశంకర్ శ్రీకాంత్ రాజాసింగ్ సాయిబాబా శ్యామ్. తదితరులు పాల్గొన్నారు1
- అడవిదేవులపల్లిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎమ్మార్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రత్యేక మండలంగా ఏర్పాటు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగిస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ చొరవ చూపాలని కోరారు.1
- మిడ్ మానేరు ముంపు గ్రామాల పునరావాస సమస్యపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రసంగం..! ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 4692 ఇండ్లు మంజూరు చేయబడినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. “కొంతమంది గ్రామస్తులు ఇప్పటికే స్వయంగా ఇండ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు (₹5 లక్షల విలువ) వారికీ ప్రయోజనం అందేలా రీమాడిఫికేషన్ చేసి, సంబంధిత బిల్లులు చెల్లించేట్టుగా చర్యలు తీసుకోవాలి.” జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిడ్ మానేరు ముంపు గ్రామాలను విస్మరించింది. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించింది. ప్రజలకు హక్కుగా అందే వసతిని మా ప్రభుత్వం నిర్ధారిస్తుంది” అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారి ఈ ప్రసంగం మిడ్ మానేరు ముంపు గ్రామాల పునరావాస సమస్యకు ప్రభుత్వ స్థాయిలో తక్షణ పరిష్కారానికి కొత్త దిశనిస్తుంది1
- Post by Ravi Poreddy1