ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయం _మల్కాజిగిరి పరిధిలో 90%కు పైగా హాజరు – మహిళల ఉత్సాహభరిత స్పందన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కాజిగిరి, మౌలాలి, కీసర సర్కిళ్లలో ఉల్లాస్ అక్షరాస్యత పథకం క్రింద నిర్వహించిన పరీక్షలు ఘనంగా విజయవంతమయ్యాయి. నవంబర్, డిసెంబర్-2025లో స్వయం సహాయక సంఘాల పరిధిలో గుర్తించిన నిరక్షరాస్యులకు వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు.ఈ శిక్షణ కు కొనసాగింపుగా 29 మార్చి 2026న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను నిర్వహించారు. కమ్యూనిటీ హాల్స్, డాక్వాన్ వనం వంటి కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో చదవడం, వ్రాత, సులభ గణిత పరీక్షలు నిర్వహించబడ్డాయి.స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మల్కాజిగిరి సర్కిల్లో 1421 మందికి గాను 1393 మంది (93.1%) హాజరుకాగా, కీసర సర్కిల్లో 4700 మందికి గాను 4356 మంది (92.7%) పరీక్షలు రాశారు. మొత్తం 5661 మంది మహిళలు, 18 మంది పురుషులు పాల్గొని ఉల్లాస్ పథకాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత పెంపొందించడంతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అధికారులు తెలిపారు.
ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయం _మల్కాజిగిరి పరిధిలో 90%కు పైగా హాజరు – మహిళల ఉత్సాహభరిత స్పందన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కాజిగిరి, మౌలాలి, కీసర సర్కిళ్లలో ఉల్లాస్ అక్షరాస్యత పథకం క్రింద నిర్వహించిన పరీక్షలు ఘనంగా విజయవంతమయ్యాయి. నవంబర్, డిసెంబర్-2025లో స్వయం సహాయక సంఘాల పరిధిలో గుర్తించిన నిరక్షరాస్యులకు వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు.ఈ శిక్షణ కు కొనసాగింపుగా 29 మార్చి 2026న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను నిర్వహించారు. కమ్యూనిటీ హాల్స్, డాక్వాన్ వనం
వంటి కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో చదవడం, వ్రాత, సులభ గణిత పరీక్షలు నిర్వహించబడ్డాయి.స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మల్కాజిగిరి సర్కిల్లో 1421 మందికి గాను 1393 మంది (93.1%) హాజరుకాగా, కీసర సర్కిల్లో 4700 మందికి గాను 4356 మంది (92.7%) పరీక్షలు రాశారు. మొత్తం 5661 మంది మహిళలు, 18 మంది పురుషులు పాల్గొని ఉల్లాస్ పథకాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత పెంపొందించడంతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని అధికారులు తెలిపారు.
- తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.2
- హనుమకొండలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.1
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- జగిత్యాల ఎస్టీ హాస్టల్లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం1
- Post by Tagore1
- ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య1
- ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.4
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1