అందరూ బాగుండాలి... ఐకమత్యంగా కలిసి ఉండాలి...* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *హాజీ సయ్యద్ హుస్సేన్ మసీద్ లో ఘనంగా విప్తార్ విందు* *హాజరైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మైనార్టీ పెద్దలు, స్థానిక నేతలు* *భారీగా హాజరైన మైనార్టీ సోదరులు, పార్టీల నేతలు,* *నియోజకవర్గం ప్రజలు చల్లగా ఉండాలి : సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం* కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలని, ప్రజలందరూ ఐకమత్యంతో సోదరభావంతో కలిసి మెలిసి ఉండటమే సమాజానికి మంచిది అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని హాజీ సయ్యద్ హుస్సేన్ మసీద్లో మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘనమైన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రతకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. రంజాన్ వేడుకలు అంటేనే ఐక్యమత్యానికి ప్రతీక అని, అందరూ కలిసి విందులో పాల్గొనడం వల్ల మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయన్నారు. షాద్నగర్ నియోజకవర్గం మతసామరస్యానికి పెట్టింది పేరు అని, ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ అన్నదమ్ముల్లా కలిసి ఉండటం గర్వకారణం అని ఆయన కొనియాడారు. అనంతరం మైనార్టీ సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. *నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి* సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దువా చేశామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందిస్తూ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుండి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మసీదు ప్రాంగణం కోలాహలంగా మారింది. మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను,ఇతర ప్రముఖులను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నేత జమ్రుద్ ఖాన్, మాజీ మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్య సాదిక్, హిమామ్ ముఫ్టీ హాఫిజ్ మోహ్మద్ అస్లామ్, అల్తాఫ్ హుస్సేన్, అబ్దుల్ రబ్జాని, జాకీర్ హుస్సేన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, పార్టీల ముఖ్య నేతలు, మైనార్టీ విభాగం పెద్దలు పాల్గొన్నారు.
అందరూ బాగుండాలి... ఐకమత్యంగా కలిసి ఉండాలి...* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *హాజీ సయ్యద్ హుస్సేన్ మసీద్ లో ఘనంగా విప్తార్ విందు* *హాజరైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మైనార్టీ పెద్దలు, స్థానిక నేతలు* *భారీగా హాజరైన మైనార్టీ సోదరులు, పార్టీల నేతలు,* *నియోజకవర్గం ప్రజలు చల్లగా ఉండాలి : సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం* కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలని, ప్రజలందరూ ఐకమత్యంతో సోదరభావంతో కలిసి మెలిసి ఉండటమే సమాజానికి మంచిది అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని హాజీ సయ్యద్ హుస్సేన్ మసీద్లో మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘనమైన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,
మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రతకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. రంజాన్ వేడుకలు అంటేనే ఐక్యమత్యానికి ప్రతీక అని, అందరూ కలిసి విందులో పాల్గొనడం వల్ల మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయన్నారు. షాద్నగర్ నియోజకవర్గం మతసామరస్యానికి పెట్టింది పేరు అని, ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ అన్నదమ్ముల్లా కలిసి ఉండటం గర్వకారణం అని ఆయన కొనియాడారు. అనంతరం మైనార్టీ సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. *నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి* సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దువా చేశామని
అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందిస్తూ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుండి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మసీదు ప్రాంగణం కోలాహలంగా మారింది. మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను,ఇతర ప్రముఖులను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నేత జమ్రుద్ ఖాన్, మాజీ మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్య సాదిక్, హిమామ్ ముఫ్టీ హాఫిజ్ మోహ్మద్ అస్లామ్, అల్తాఫ్ హుస్సేన్, అబ్దుల్ రబ్జాని, జాకీర్ హుస్సేన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, పార్టీల ముఖ్య నేతలు, మైనార్టీ విభాగం పెద్దలు పాల్గొన్నారు.
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.1
- More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆5
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.2