రెండేళ్ల అభివృద్ధి, పథకాలపై ప్రజల్లో అవగాహన.. సమస్యల పరిష్కారానికే ఇంటింటికి తెలుగుదేశం : మంత్రి సంధ్యారాణి.. మెంటాడలో జాతరను తలపించేలా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. మెంటాడ మండలంలో రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు తదుపరి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలను ప్రజలకు వివరించారు.* సమర్థవంతమైన పాలనతోనే ప్రజలకు మెరుగైన ఫలితాలు సమర్థులైన పాలకుల ఆలోచనలు, అనుభవం, విధానాలు కార్యరూపం దాలిస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన నిరూపించిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.నెలరోజులుగా పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల అవసరాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల వద్దకు నాయకులు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.
రెండేళ్ల అభివృద్ధి, పథకాలపై ప్రజల్లో అవగాహన.. సమస్యల పరిష్కారానికే ఇంటింటికి తెలుగుదేశం : మంత్రి సంధ్యారాణి.. మెంటాడలో జాతరను తలపించేలా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. మెంటాడ మండలంలో రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని
మంత్రి తెలిపారు తదుపరి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలను ప్రజలకు వివరించారు.* సమర్థవంతమైన పాలనతోనే ప్రజలకు మెరుగైన ఫలితాలు సమర్థులైన పాలకుల ఆలోచనలు, అనుభవం, విధానాలు కార్యరూపం దాలిస్తే
ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన నిరూపించిందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.నెలరోజులుగా పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ
లభిస్తోందన్నారు.స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల అవసరాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల వద్దకు నాయకులు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.
- విజయనగరం జిల్లా రాజ్యాంలో హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తోంది.. రాజం శారది రోడ్లో ఉన్న జిల్లా పరిషత్తు బాలికలు ఉన్నత పాఠశాల, బాలికలు జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న కడప రమా తమ బంధువులు పెళ్లి వేడుకల్లో కొంతమంది బాలికలను రోడ్డుపై స్టెప్పులు వేయించడం స్థానికంగా విమర్శలు విలువతున్నాయి.. విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించడం స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించును ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.4
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.1
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం1
- శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఐదుగురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు.. మరో ఇద్దరు పరిస్థితి విషమం.. *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* ..! ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..! ఐదుగురు మృతి.. ఇరవై మందికి తీవ్ర గాయాలు..! మరో ఇద్దరి పరిస్థితి విషమం..! కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘటన.. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం..! ఆగి ఉన్న కంటైనర్ను వేగంగా ఢీకొట్టిన బస్సు..! ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు..! బస్సులో ఇరుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలు..! ఘటనా స్థలంలో భయానక పరిస్థితి..! బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు..! తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలింపు..! ప్రమాదంతో హైదరాబాద్–ఏలూరు మార్గంలో తీవ్ర ఉద్రిక్తత..! ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..! ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం..! మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన..! ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!2