రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.
- రామ్ సార్ షాపింగ్ మాల్ జి గార్డెన్ ఫంక్షన్ హాల్ ప్రధాన రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ లేని రహదారిపై ప్రమాద గంటికలు వనపర్తి (ప్రత్యేక ప్రతినిధి): వనపర్తి పట్టణంలోని జి గార్డెన్ ఫంక్షన్ హాల్ మరియు రాంస షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగం మితిమీరిపోవడంతో రోడ్డు దాటే కాలినడక ప్రయాణికులు తీవ్ర తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు దాటాల్సి వస్తోంది. అయితే, ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలు వేగంగా రావడంతో కాలినడకన వెళ్లేవారు రోడ్డు దాటడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ పలు చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి: అధికారులు తక్షణమే స్పందించి జి గార్డెన్ – రాంస షాపింగ్ మాల్ సమీపంలో వెంటనే ప్రమాద నివారణకు స్పీడ్ బ్రేకర్లను మరియు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత మున్సిపల్, పోలీసు, మరియు రహదారుల శాఖ అధికారులను కోరుతున్నారు.1
- పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి, *➤ పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్లను తనిఖీ చేసిన ఎస్పీ* *➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ* *➤ ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన* *➤ ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు* పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.1
- NGKL: బీచుపల్లి వద్ద నురగలు గక్కుతున్న కృష్ణమ్మ పరవళ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు విడుదల చేయడంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బీచుపల్లి వంతెన వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలు పర్యాటకులను, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలకాలాడేందుకు నదిలోకి ఎవరూ దిగవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరించింది.2
- రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాను తొమ్మిది తలల సర్పమని చెప్పిందంటే.. ఏ స్థాయిలో వీళ్లు అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. సీఎం రేవంత్కు ఒక వ్యక్తి ముఖ్యమో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమో తేల్చుకోవాలన్నారు.1
- ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ చౌరస్తా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన ఫైర్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వర త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు అగ్నిమాపక సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు1
- నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ* నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గురుపౌర్ణమి సందర్భంగా కొబ్బరి బొండం పై సాయినాథుని చిత్రం గురుపౌర్ణమి పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన కళారూపం అందరినీ ఆకట్టుకుంటోంది. వెలుగోడుకు చెందిన కళాకారుడు కళ్యాణ్ కొబ్బరి బొండం పై సాయినాథుని దివ్య చిత్రాన్ని వేసి భక్తిని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి 6 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రంలో సాయినాథుని దివ్యమైన ముఖారవిందంతో పాటు, ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రం రూపంలో వివరించినట్లు తెలిపారు.1
- రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి మధ్య యుద్ధం జరుగుతుంది రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అందుకే అన్నారు ఈ బుల్డోజర్ పాలనను అణిచివేయాలని అని అన్నారు. ఈరోజు హైకోర్టు రంగనాథ్ను తీసి పక్కన పడేయడం శుభ పరిణామం అన్నారు.1