ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరం పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని , ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త అవసరమని మంత్రి టి జి భరత్ హెచ్ పి వి టీకా ప్రారంభ కార్యక్రమంలో తెలియజేశారు. మంగళవారం ఉదయం ఏ- క్యాంప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కు ఏర్పాటు చేసిన హెచ్ పి వి ( హుమెన్ పాపిలోమ వైరస్ ) టీకా ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశంలో పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పాల్గొని ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరమని తెలిపారు.14 సంవత్సరాల వయస్సు మొదలు అయ్యి 15 సంవత్సరాల లోపల వయసు గల అమ్మాయిలకు మాత్రమే నాలుగు వేల రూపాయల ఖరీదు చేసే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నివారించే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని దీని గురించి అందరికీ తెలియజేయాలని సమావేశంలో పాల్గొన్న వారిని కోరారు. ఈ టీకాను అన్ని విధాల పరీక్షలు జరిపి 96% సక్సెస్ రేటు తో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిందని , దీనిని ఈ వయసు వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 28వ తారీఖున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ లో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారని తెలియజేశారు. జిల్లాలో దాదాపు 30 వేల మందికి టీకా వేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలియజేశారు. *ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని మాట్లాడుతూ...* మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన టీకాలు , మందులు మనం అవసరం మేరకు వాడాలని తెలుపుతూ కోవిడ్-19 సమయంలో రోగ నిరోధకానికి గాను టీకాలు మనం తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను నివారించడానికి అన్ని వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తీసుకుని వచ్చిన ఈ టీకాను అమ్మాయిలు సరియైన వయసులో తీసుకోవలసిన అవసరం ఉన్నదని కావున తప్పక తీసుకొని తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు.
ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరం పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని , ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త అవసరమని మంత్రి టి జి భరత్ హెచ్ పి వి టీకా ప్రారంభ కార్యక్రమంలో తెలియజేశారు. మంగళవారం ఉదయం ఏ- క్యాంప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కు ఏర్పాటు చేసిన హెచ్ పి వి ( హుమెన్ పాపిలోమ వైరస్ ) టీకా ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశంలో పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పాల్గొని ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరమని తెలిపారు.14 సంవత్సరాల వయస్సు మొదలు అయ్యి 15 సంవత్సరాల లోపల వయసు గల అమ్మాయిలకు మాత్రమే నాలుగు వేల రూపాయల ఖరీదు చేసే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నివారించే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని దీని గురించి అందరికీ తెలియజేయాలని సమావేశంలో
పాల్గొన్న వారిని కోరారు. ఈ టీకాను అన్ని విధాల పరీక్షలు జరిపి 96% సక్సెస్ రేటు తో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిందని , దీనిని ఈ వయసు వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 28వ తారీఖున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ లో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారని తెలియజేశారు. జిల్లాలో దాదాపు 30 వేల మందికి టీకా వేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలియజేశారు. *ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని మాట్లాడుతూ...* మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన టీకాలు , మందులు మనం అవసరం మేరకు వాడాలని తెలుపుతూ కోవిడ్-19 సమయంలో రోగ నిరోధకానికి గాను టీకాలు మనం తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను నివారించడానికి అన్ని వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తీసుకుని వచ్చిన ఈ టీకాను అమ్మాయిలు సరియైన వయసులో తీసుకోవలసిన అవసరం ఉన్నదని కావున తప్పక తీసుకొని తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు.
- Post by Magathala Siddhartha2
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నాగర్కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- *హైదరాబాద్లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు1