*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1
- Post by N సూరి4
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 17:ఇటీవల సీమక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎన్నికైన షేక్ జహంగీర్ భాషను శుక్రవారం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చినబాబు ఎం ఎస్ పి నాయకులు గంగిపోవు నరసింహులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తున్న జహంగీర్ భాషకు పార్టీ అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ ప్రజలందరికీ అవసరమైన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఆస్పత్రికి అవసరమైన మరిన్ని పరికరాలు తెప్పించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు జహంగీర్ భాష కృషి చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్. శ్రీను. మునయ్య మాజీ కౌన్సిలర్ రవిచంద్ర దానమయ్య రాజు మహబూబ్ బాషా ప్రదీప్ విక్రమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు,1
- నందికొట్కూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆవోపా ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం కేంద్రాన్ని ఎస్సై సురేష్ సందర్శించే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్ మజ్జిగ ను పంపిణీ చేశారు.1
- నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.1
- యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.1
- Post by Bondhu Suresh1