logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

on 11 April
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
on 11 April
8500815e-5414-4916-ad41-f56547322282

*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లా, పాణ్యం మండలం బలపనూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఏపీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల నుండి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 19 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఈరోజు విద్యార్థినులను అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.
    1
    నంద్యాల జిల్లా, పాణ్యం మండలం బలపనూరులోని మహాత్మ జ్యోతిరావు ఫూలే, ఏపీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల నుండి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 19 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఈరోజు విద్యార్థినులను అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, గుజ్జనగుండ్ల పలకలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గుజ్జనగుండ్లలో పెద్ద ఎత్తున వాహనాలను ఆపి తనిఖీ చేసిన అధికారులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
    1
    తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, గుజ్జనగుండ్ల పలకలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గుజ్జనగుండ్లలో పెద్ద ఎత్తున వాహనాలను ఆపి తనిఖీ చేసిన అధికారులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    3 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి. హర్షకుమార్ జూన్ 18, 2026న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు ఉన్నత స్థాయి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషాద ఘటన జరిగి 400 రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలోగానీ, శాస్త్రీయ ఆధారాలతో కేసును అధికారికంగా ముగించడంలోగానీ పూర్తిగా విఫలమైందని ఆయన తన వినతిపత్రంలో పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత తొలుత డాక్టర్ కె.ఎ. పాల్ గారు సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు విచారణ నిమిత్తం ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. న్యాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశ్యంతో జి.వి. హర్షకుమార్ ఈ న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. హర్షకుమార్ వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు అదే విధంగా ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో, దీనిని వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యంగా మిగిలిపోనివ్వకుండా, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా మార్చేందుకు ఆయన ప్రజల మద్దతు కోరారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తలా ₹10 విరాళంగా ఇవ్వాలని పిలుపునివ్వగా, 8,000 మందికి పైగా పౌరులు స్పందించి విరాళాలు పంపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి వివరాలతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా కోర్టు సూచించిన ₹5 లక్షల మొత్తాన్ని గౌరవ కోర్టుకు విజయవంతంగా సమర్పించడం జరిగింది. అయితే, కోర్టు విధించిన కఠినమైన ఆర్థిక నిబంధనలను నెరవేర్చి, ప్రజల మద్దతును నిరూపించినప్పటికీ దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసులో ఇప్పటివరకు తమ కౌంటర్ దాఖలు చేయకపోవడం పోలీసుల ఉదాసీనతకు అద్దం పడుతోందని హర్షకుమార్ విమర్శించారు. ఈ జాప్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు హక్కును కాలరాయడమేనని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.వి. హర్షకుమార్ మాట్లాడుతూ, తాను ₹5 లక్షలు సొంతంగా కట్టగలనని, కానీ ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన పోరాటం కేవలం తన వ్యక్తిగతం కాకూడదని అన్నారు. 8,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇచ్చి ఈ న్యాయపోరాటంలో భాగస్వాములయ్యారని, గత 400 రోజులుగా పోలీసుల మౌనం వారిని అవమానించడమేనని, తమకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని, ఈ మృతి వెనుక ఉన్న నిజం బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో 400 రోజులకు పైగా జరుగుతున్న అసాధారణ జాప్యానికి గల కారణాలను వివరిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, తూర్పుగోదావరి ఎస్పీ, ఏలూరు డీఐజీలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా, సేకరించిన ఆధారాలన్నింటినీ పబ్లిక్ రికార్డులో ఉంచేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్థానిక పోలీసు వ్యవస్థ ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో, నిష్పాక్షిక విచారణ కోసం కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి వచ్చి, న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని జి.వి. హర్షకుమార్, ఆయన మద్దతుదారులు స్పష్టం చేశారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి. హర్షకుమార్ జూన్ 18, 2026న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు ఉన్నత స్థాయి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషాద ఘటన జరిగి 400 రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలోగానీ, శాస్త్రీయ ఆధారాలతో కేసును అధికారికంగా ముగించడంలోగానీ పూర్తిగా విఫలమైందని ఆయన తన వినతిపత్రంలో పేర్కొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత తొలుత డాక్టర్ కె.ఎ. పాల్ గారు సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు విచారణ నిమిత్తం ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. న్యాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశ్యంతో జి.వి. హర్షకుమార్ ఈ న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. హర్షకుమార్ వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు అదే విధంగా ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో, దీనిని వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యంగా మిగిలిపోనివ్వకుండా, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా మార్చేందుకు ఆయన ప్రజల మద్దతు కోరారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తలా ₹10 విరాళంగా ఇవ్వాలని పిలుపునివ్వగా, 8,000 మందికి పైగా పౌరులు స్పందించి విరాళాలు పంపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి వివరాలతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా కోర్టు సూచించిన ₹5 లక్షల మొత్తాన్ని గౌరవ కోర్టుకు విజయవంతంగా సమర్పించడం జరిగింది.

అయితే, కోర్టు విధించిన కఠినమైన ఆర్థిక నిబంధనలను నెరవేర్చి, ప్రజల మద్దతును నిరూపించినప్పటికీ దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసులో ఇప్పటివరకు తమ కౌంటర్ దాఖలు చేయకపోవడం పోలీసుల ఉదాసీనతకు అద్దం పడుతోందని హర్షకుమార్ విమర్శించారు. ఈ జాప్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు హక్కును కాలరాయడమేనని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.వి. హర్షకుమార్ మాట్లాడుతూ, తాను ₹5 లక్షలు సొంతంగా కట్టగలనని, కానీ ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన పోరాటం కేవలం తన వ్యక్తిగతం కాకూడదని అన్నారు. 8,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇచ్చి ఈ న్యాయపోరాటంలో భాగస్వాములయ్యారని, గత 400 రోజులుగా పోలీసుల మౌనం వారిని అవమానించడమేనని, తమకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని, ఈ మృతి వెనుక ఉన్న నిజం బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో 400 రోజులకు పైగా జరుగుతున్న అసాధారణ జాప్యానికి గల కారణాలను వివరిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, తూర్పుగోదావరి ఎస్పీ, ఏలూరు డీఐజీలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా, సేకరించిన ఆధారాలన్నింటినీ పబ్లిక్ రికార్డులో ఉంచేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్థానిక పోలీసు వ్యవస్థ ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో, నిష్పాక్షిక విచారణ కోసం కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి వచ్చి, న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని జి.వి. హర్షకుమార్, ఆయన మద్దతుదారులు స్పష్టం చేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో గురువారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానిదవడం గర్వకారణమని పేర్కొన్నారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో గురువారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానిదవడం గర్వకారణమని పేర్కొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యం 15వ డివిజన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిసరాలు మరుగుదొడ్ల వలె మారాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి పైప్‌లైన్ చుట్టూ గుబురు చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు తమ బ్యాగులతో వంగి నీళ్లు తాగాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వచ్చే నీరు త్రాగడానికి పనికిరాకుండా మురికిగా, తుప్పు వాసనతో వస్తోందని, గత రెండు సంవత్సరాలుగా ఆర్‌వో ప్లాంట్ మూతపడి ఉందని సమాచారం. అధికారులు రిపేర్ చేయించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు. దీనితో పాటు, పాఠశాల గేటు తుప్పుపట్టి, భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. "పురుగు కుట్టినా, పాము కాటేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యం 15వ డివిజన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిసరాలు మరుగుదొడ్ల వలె మారాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచి నీటి పైప్‌లైన్ చుట్టూ గుబురు చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు తమ బ్యాగులతో వంగి నీళ్లు తాగాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వచ్చే నీరు త్రాగడానికి పనికిరాకుండా మురికిగా, తుప్పు వాసనతో వస్తోందని, గత రెండు సంవత్సరాలుగా ఆర్‌వో ప్లాంట్ మూతపడి ఉందని సమాచారం. అధికారులు రిపేర్ చేయించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు. దీనితో పాటు, పాఠశాల గేటు తుప్పుపట్టి, భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది.

"పురుగు కుట్టినా, పాము కాటేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_దాసి ప్రతాప్
    దాసి ప్రతాప్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైయస్సార్ పార్టీ నాయకుడు అమర్‌నాథ్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆడవారిపై మాట్లాడేటప్పుడు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆచి చూసి మాట్లాడాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే, ఆడవారు ఆదిపరాశక్తి రూపాన్ని చూపించాల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు అమర్‌నాథ్‌ తన ఇంట్లో మహిళలు లేరా అని ప్రశ్నించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనసూయ, తప్పుగా మాట్లాడితే రాష్ట్రంలోని మహిళలు ఊరుకోబోరని హెచ్చరించారు. వైయస్సార్ పార్టీ అమర్‌నాథ్ తన నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
    1
    కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైయస్సార్ పార్టీ నాయకుడు అమర్‌నాథ్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆడవారిపై మాట్లాడేటప్పుడు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆచి చూసి మాట్లాడాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే, ఆడవారు ఆదిపరాశక్తి రూపాన్ని చూపించాల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు.

మహిళల గురించి మాట్లాడేటప్పుడు అమర్‌నాథ్‌ తన ఇంట్లో మహిళలు లేరా అని ప్రశ్నించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనసూయ, తప్పుగా మాట్లాడితే రాష్ట్రంలోని మహిళలు ఊరుకోబోరని హెచ్చరించారు. వైయస్సార్ పార్టీ అమర్‌నాథ్ తన నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఒక కాపు యువకుడిని, జనసేన కార్యకర్తను లాకప్‌లో చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను రాజీ కోసం పంపుతారా అని ప్రశ్నిస్తున్నారు. జనసేన కార్యకర్తను లాకప్‌లో హత్య చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
    1
    ఒక కాపు యువకుడిని, జనసేన కార్యకర్తను లాకప్‌లో చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను రాజీ కోసం పంపుతారా అని ప్రశ్నిస్తున్నారు. జనసేన కార్యకర్తను లాకప్‌లో హత్య చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు గురువారం, జూన్ 18న కనగానపల్లి మండలం భానుకోట గ్రామ సమీపంలో చేపట్టిన 'పరిటాల రవీంద్ర సాగునీటి పథకం' కాలువ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుండి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పెరూరు ప్రాజెక్టు) వరకు 54 కిలోమీటర్ల పొడవునా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కాలువ పనులను ఆయన రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు భానుకోట గ్రామ సమీపంలోని 30.6వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న కాలువ అక్విడెక్ట్ నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకూడదని, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులన్నింటినీ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కాంట్రాక్టర్లను స్పష్టంగా ఆదేశించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు మాట్లాడుతూ, ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా దివంగత నేత పరిటాల రవీంద్ర గారి పేరున ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను మళ్లీ వేగవంతం చేసి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు నీరు చేర్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. పనుల్లో వేగం పెంచేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు మాట్లాడుతూ, కాలువ పనులు త్వరగా పూర్తయితే ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఈఈలు, డీఈలు, స్థానిక రెవెన్యూ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు గురువారం, జూన్ 18న కనగానపల్లి మండలం భానుకోట గ్రామ సమీపంలో చేపట్టిన 'పరిటాల రవీంద్ర సాగునీటి పథకం' కాలువ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుండి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పెరూరు ప్రాజెక్టు) వరకు 54 కిలోమీటర్ల పొడవునా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కాలువ పనులను ఆయన రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌లతో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గారు భానుకోట గ్రామ సమీపంలోని 30.6వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న కాలువ అక్విడెక్ట్ నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాలువ నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకూడదని, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులన్నింటినీ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కాంట్రాక్టర్లను స్పష్టంగా ఆదేశించారు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు మాట్లాడుతూ, ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా దివంగత నేత పరిటాల రవీంద్ర గారి పేరున ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను మళ్లీ వేగవంతం చేసి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు నీరు చేర్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. పనుల్లో వేగం పెంచేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు మాట్లాడుతూ, కాలువ పనులు త్వరగా పూర్తయితే ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఈఈలు, డీఈలు, స్థానిక రెవెన్యూ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.