logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

8 hrs ago
user_పల్లె నరేష్
పల్లె నరేష్
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago

జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి. హర్షకుమార్ జూన్ 18, 2026న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు ఉన్నత స్థాయి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషాద ఘటన జరిగి 400 రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలోగానీ, శాస్త్రీయ ఆధారాలతో కేసును అధికారికంగా ముగించడంలోగానీ పూర్తిగా విఫలమైందని ఆయన తన వినతిపత్రంలో పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత తొలుత డాక్టర్ కె.ఎ. పాల్ గారు సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు విచారణ నిమిత్తం ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. న్యాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశ్యంతో జి.వి. హర్షకుమార్ ఈ న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. హర్షకుమార్ వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు అదే విధంగా ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో, దీనిని వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యంగా మిగిలిపోనివ్వకుండా, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా మార్చేందుకు ఆయన ప్రజల మద్దతు కోరారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తలా ₹10 విరాళంగా ఇవ్వాలని పిలుపునివ్వగా, 8,000 మందికి పైగా పౌరులు స్పందించి విరాళాలు పంపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి వివరాలతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా కోర్టు సూచించిన ₹5 లక్షల మొత్తాన్ని గౌరవ కోర్టుకు విజయవంతంగా సమర్పించడం జరిగింది. అయితే, కోర్టు విధించిన కఠినమైన ఆర్థిక నిబంధనలను నెరవేర్చి, ప్రజల మద్దతును నిరూపించినప్పటికీ దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసులో ఇప్పటివరకు తమ కౌంటర్ దాఖలు చేయకపోవడం పోలీసుల ఉదాసీనతకు అద్దం పడుతోందని హర్షకుమార్ విమర్శించారు. ఈ జాప్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు హక్కును కాలరాయడమేనని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.వి. హర్షకుమార్ మాట్లాడుతూ, తాను ₹5 లక్షలు సొంతంగా కట్టగలనని, కానీ ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన పోరాటం కేవలం తన వ్యక్తిగతం కాకూడదని అన్నారు. 8,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇచ్చి ఈ న్యాయపోరాటంలో భాగస్వాములయ్యారని, గత 400 రోజులుగా పోలీసుల మౌనం వారిని అవమానించడమేనని, తమకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని, ఈ మృతి వెనుక ఉన్న నిజం బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో 400 రోజులకు పైగా జరుగుతున్న అసాధారణ జాప్యానికి గల కారణాలను వివరిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, తూర్పుగోదావరి ఎస్పీ, ఏలూరు డీఐజీలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా, సేకరించిన ఆధారాలన్నింటినీ పబ్లిక్ రికార్డులో ఉంచేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్థానిక పోలీసు వ్యవస్థ ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో, నిష్పాక్షిక విచారణ కోసం కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి వచ్చి, న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని జి.వి. హర్షకుమార్, ఆయన మద్దతుదారులు స్పష్టం చేశారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి. హర్షకుమార్ జూన్ 18, 2026న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌కు ఉన్నత స్థాయి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషాద ఘటన జరిగి 400 రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలోగానీ, శాస్త్రీయ ఆధారాలతో కేసును అధికారికంగా ముగించడంలోగానీ పూర్తిగా విఫలమైందని ఆయన తన వినతిపత్రంలో పేర్కొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత తొలుత డాక్టర్ కె.ఎ. పాల్ గారు సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు విచారణ నిమిత్తం ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. న్యాయం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశ్యంతో జి.వి. హర్షకుమార్ ఈ న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. హర్షకుమార్ వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు అదే విధంగా ₹5,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో, దీనిని వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యంగా మిగిలిపోనివ్వకుండా, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా మార్చేందుకు ఆయన ప్రజల మద్దతు కోరారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తలా ₹10 విరాళంగా ఇవ్వాలని పిలుపునివ్వగా, 8,000 మందికి పైగా పౌరులు స్పందించి విరాళాలు పంపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి వివరాలతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా కోర్టు సూచించిన ₹5 లక్షల మొత్తాన్ని గౌరవ కోర్టుకు విజయవంతంగా సమర్పించడం జరిగింది.

అయితే, కోర్టు విధించిన కఠినమైన ఆర్థిక నిబంధనలను నెరవేర్చి, ప్రజల మద్దతును నిరూపించినప్పటికీ దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసులో ఇప్పటివరకు తమ కౌంటర్ దాఖలు చేయకపోవడం పోలీసుల ఉదాసీనతకు అద్దం పడుతోందని హర్షకుమార్ విమర్శించారు. ఈ జాప్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు హక్కును కాలరాయడమేనని గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జి.వి. హర్షకుమార్ మాట్లాడుతూ, తాను ₹5 లక్షలు సొంతంగా కట్టగలనని, కానీ ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన పోరాటం కేవలం తన వ్యక్తిగతం కాకూడదని అన్నారు. 8,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇచ్చి ఈ న్యాయపోరాటంలో భాగస్వాములయ్యారని, గత 400 రోజులుగా పోలీసుల మౌనం వారిని అవమానించడమేనని, తమకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని, ఈ మృతి వెనుక ఉన్న నిజం బయటపడాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా మూడు డిమాండ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో 400 రోజులకు పైగా జరుగుతున్న అసాధారణ జాప్యానికి గల కారణాలను వివరిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, తూర్పుగోదావరి ఎస్పీ, ఏలూరు డీఐజీలను ఆదేశించాలని డిమాండ్ చేశారు. సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే గౌరవ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా, సేకరించిన ఆధారాలన్నింటినీ పబ్లిక్ రికార్డులో ఉంచేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్థానిక పోలీసు వ్యవస్థ ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో, నిష్పాక్షిక విచారణ కోసం కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్న నిజానిజాలు వెలుగులోకి వచ్చి, న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని జి.వి. హర్షకుమార్, ఆయన మద్దతుదారులు స్పష్టం చేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యం 15వ డివిజన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిసరాలు మరుగుదొడ్ల వలె మారాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి పైప్‌లైన్ చుట్టూ గుబురు చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు తమ బ్యాగులతో వంగి నీళ్లు తాగాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వచ్చే నీరు త్రాగడానికి పనికిరాకుండా మురికిగా, తుప్పు వాసనతో వస్తోందని, గత రెండు సంవత్సరాలుగా ఆర్‌వో ప్లాంట్ మూతపడి ఉందని సమాచారం. అధికారులు రిపేర్ చేయించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు. దీనితో పాటు, పాఠశాల గేటు తుప్పుపట్టి, భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. "పురుగు కుట్టినా, పాము కాటేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యం 15వ డివిజన్‌లోని పాఠశాలల్లో విద్యార్థులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిసరాలు మరుగుదొడ్ల వలె మారాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచి నీటి పైప్‌లైన్ చుట్టూ గుబురు చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతంలో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు తమ బ్యాగులతో వంగి నీళ్లు తాగాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాలలకు వచ్చే నీరు త్రాగడానికి పనికిరాకుండా మురికిగా, తుప్పు వాసనతో వస్తోందని, గత రెండు సంవత్సరాలుగా ఆర్‌వో ప్లాంట్ మూతపడి ఉందని సమాచారం. అధికారులు రిపేర్ చేయించాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు. దీనితో పాటు, పాఠశాల గేటు తుప్పుపట్టి, భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది.

"పురుగు కుట్టినా, పాము కాటేసినా ఎవరు బాధ్యత వహిస్తారు?" అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_దాసి ప్రతాప్
    దాసి ప్రతాప్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, గుజ్జనగుండ్ల పలకలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గుజ్జనగుండ్లలో పెద్ద ఎత్తున వాహనాలను ఆపి తనిఖీ చేసిన అధికారులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
    1
    తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, గుజ్జనగుండ్ల పలకలూరు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గుజ్జనగుండ్లలో పెద్ద ఎత్తున వాహనాలను ఆపి తనిఖీ చేసిన అధికారులు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    4 hrs ago
  • సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
    4
    సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం సత్తుపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుండి Way2News ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణాలు, విద్యా మరియు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

ఎమ్మెల్యే దయానంద్ ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను ఓర్పుగా విన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించగా, మరికొన్ని అంశాలపై పూర్తి వివరాలు సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం వారి బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

ఈ "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలనకు ఇది నిదర్శనమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం మండల పాడు సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద 2006వ సంవత్సరంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి రేణుక చౌదరి చేతుల మీదుగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం, 20 ఏళ్లుగా ప్రజలకు కనిపించకుండా నిరుపయోగంగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కమ్యూనిటీ హాల్‌ను చాలా మందికి తెలియకుండా ఒక కుటుంబం నివాసంగా వాడుకుంటోందని, అలాగే భవనం చెత్తాచెదారంతో నిండిపోయి స్థానికులకు ఒక స్టోర్ రూమ్‌గా మారిందని సమాచారం. ఈ పరిస్థితి చూస్తుంటే, అసలు ఈ భవనం ఉందని గ్రామస్తులకు తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు పనికిరాని ఈ భవనం ఎందుకు నిర్మించినట్టు అని, స్థానికులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించి ప్రజలకు ఉపయోగకరంగా మలుస్తోందా, లేక నిర్లక్ష్య ధోరణితో ప్రజల భూమిని, డబ్బును వృథా చేస్తోందా అని తీవ్ర అరోపణలు చేశారు.
    1
    ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం మండల పాడు సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద 2006వ సంవత్సరంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి రేణుక చౌదరి చేతుల మీదుగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం, 20 ఏళ్లుగా ప్రజలకు కనిపించకుండా నిరుపయోగంగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కమ్యూనిటీ హాల్‌ను చాలా మందికి తెలియకుండా ఒక కుటుంబం నివాసంగా వాడుకుంటోందని, అలాగే భవనం చెత్తాచెదారంతో నిండిపోయి స్థానికులకు ఒక స్టోర్ రూమ్‌గా మారిందని సమాచారం. ఈ పరిస్థితి చూస్తుంటే, అసలు ఈ భవనం ఉందని గ్రామస్తులకు తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎందుకు పనికిరాని ఈ భవనం ఎందుకు నిర్మించినట్టు అని, స్థానికులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించి ప్రజలకు ఉపయోగకరంగా మలుస్తోందా, లేక నిర్లక్ష్య ధోరణితో ప్రజల భూమిని, డబ్బును వృథా చేస్తోందా అని తీవ్ర అరోపణలు చేశారు.
    user_Ajmera Sunitha
    Ajmera Sunitha
    Electrician పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    జాతీయ జల మిషన్ డైరెక్టర్ నెలాపట్ల అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ నాయక్, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ డి. శకుంతల, ఎంఈఓ పుష్పలీల, అంగన్వాడీ టీచర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఖమ్మం జిల్లా మధిర చెరువు కట్ట (ట్యాంక్‌బండ్) రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబారుపేట గ్రామానికి చెందిన జక్కంపూడి ఉపేందర్ (35) మరణించారు. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న కంకర కారణంగా బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన గోపిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కంకర మున్సిపాలిటీ పనుల వల్ల వచ్చిందా లేదా ప్రైవేట్ పనుల వల్ల వచ్చిందా అనే దానిపై అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ఖమ్మం జిల్లా మధిర చెరువు కట్ట (ట్యాంక్‌బండ్) రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబారుపేట గ్రామానికి చెందిన జక్కంపూడి ఉపేందర్ (35) మరణించారు. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న కంకర కారణంగా బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన గోపిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ప్రమాదానికి కారణమైన కంకర మున్సిపాలిటీ పనుల వల్ల వచ్చిందా లేదా ప్రైవేట్ పనుల వల్ల వచ్చిందా అనే దానిపై అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Romeet
    Romeet
    న్యాయవాది బోనకల్, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.