మైనర్ బాలిక కిడ్నాప్ అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో సంచలనం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ములుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడు, అనంతరం ఆమెపై దురాగతానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు వివరాల ప్రకారం, బాధిత బాలిక గజ్వేల్లో చదువుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన పగిడిపల్లి భాను ప్రసాద్ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికి దగ్గరయ్యాడు. కొంతకాలంగా ఆమెను వెంటాడుతూ ఒత్తిడి తీసుకొచ్చిన భాను ప్రసాద్ చివరకు ఆమెను మోసం చేసి గజ్వేల్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్వీ గ్రాండ్ లాడ్జిలో ఆమెను ఉంచి శారీరకంగా లోబడుచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ ఘటన అనంతరం బాలిక గర్భవతిగా మారిన విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆధారంగా సేకరించి నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న SV లాడ్జి నిర్వాహకుడు సింగాటం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మండల యూత్ అధ్యక్షుడు ఎర్ల రాజశేఖర్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలికను సరైన ధృవపత్రాలు లేకుండా గది ఇవ్వడం, నిందితుడికి సహకరించడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఆ SV లాడ్జి పైన గతంలో అనేక అనుమానాలు ఉన్నాయి. జూదం అశ్లీల కార్యక్రమాలు చేపడుతున్నారు. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు మాట్లాడుతూ బాలికపై జరిగిన అన్యాయానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు చెప్పారు. అదేవిధంగా మైనర్ బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిణామాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటనతో గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఇలాంటి కార్యక్రమాలకు ఆశ్రయమిస్తున్న ఎస్వీ లాడ్జిను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు...
మైనర్ బాలిక కిడ్నాప్ అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో సంచలనం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ములుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడు, అనంతరం ఆమెపై దురాగతానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు వివరాల ప్రకారం, బాధిత బాలిక గజ్వేల్లో
చదువుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన పగిడిపల్లి భాను ప్రసాద్ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మబలికి దగ్గరయ్యాడు. కొంతకాలంగా ఆమెను వెంటాడుతూ ఒత్తిడి తీసుకొచ్చిన భాను ప్రసాద్ చివరకు ఆమెను మోసం చేసి గజ్వేల్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ఎస్వీ గ్రాండ్ లాడ్జిలో ఆమెను ఉంచి శారీరకంగా లోబడుచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ ఘటన అనంతరం బాలిక గర్భవతిగా మారిన విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా
ఆధారంగా సేకరించి నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న SV లాడ్జి నిర్వాహకుడు సింగాటం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మండల యూత్ అధ్యక్షుడు ఎర్ల రాజశేఖర్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలికను సరైన ధృవపత్రాలు లేకుండా గది ఇవ్వడం, నిందితుడికి సహకరించడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఆ SV లాడ్జి పైన గతంలో అనేక అనుమానాలు ఉన్నాయి. జూదం అశ్లీల కార్యక్రమాలు
చేపడుతున్నారు. గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు మాట్లాడుతూ బాలికపై జరిగిన అన్యాయానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు చెప్పారు. అదేవిధంగా మైనర్ బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిణామాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటనతో గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఇలాంటి కార్యక్రమాలకు ఆశ్రయమిస్తున్న ఎస్వీ లాడ్జిను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు...
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*1
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది: 1. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ 3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ 4. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్ 5. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ సైన్స్) ৪. ఎం,ఏ ( యోగ) 9. ఎంఎసత ఎం 10. ఎం.ఏ. (క్రీడా జర్నలిజం) 11. ఫిట్నెస్ నిర్వహణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హత, ఫీజు మరియు ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను పరిశీలించాలని మరియు ఏవైనా ఇతర సందేహాలకు 0751,4000887 ఫోన్ నంబర్ ను సంప్రదించగలరని తెలిపారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- Post by నీరటి మహేందర్1
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1