సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీలో సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్థినిల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు, సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. చెట్లతాండ్ర గ్రామానికి చెందిన చక్క రామారావు, లక్ష్మి దంపతుల ముగ్గురు కుమార్తెలు అనిత, సమజ్ఞ, శరణ్య దండు గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. వీరు ముగ్గురూ క్రమశిక్షణతో చదివి 2021, 2025, 2026 విద్యా సంవత్సరాలలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఐఐఐటీలో సీట్లు సంపాదించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఇలా ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీట్లు పొందడం అరుదైన విషయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విజయం మిగిలిన విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులైన రామారావు, లక్ష్మీ దంపతులను జ్ఞాపికను అందజేసి, దుస్సాలువ కప్పి, బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట గంగన్న మాట్లాడుతూ, ఈ ముగ్గురు బాలికల విజయం పాఠశాలకు, విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఇలాంటి విజయాలు అరుదుగా జరుగుతుంటాయని, ఇలాంటి ఆణిముత్యాలు అయిన విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పై చదువులలో మరింత రాణించి పాఠశాల పేరు ప్రఖ్యాతలను మరింతగా ఇనుమడింప చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల తండ్రి రామారావు మాట్లాడుతూ, తమ పిల్లలను ఇంత చక్కగా, క్రమశిక్షణగా విద్యాభ్యాసం గావించిన పాఠశాల ఉపాధ్యాయుల సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. వారి కృషి వలనే తమకు ఇది సాధ్యమైందని, వారికి ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, శారదాంబ, అన్నాజీ, జె.శ్రీనివాసరావు, మురళీధరరాజు, రాము, సూర్యప్రకాష్, శ్రీధరు, విజయలక్ష్మి, కె.శ్రీనివాసరావు, లక్ష్మన్నునాయుడు, డి.శ్రీనివాసరావు, దయాసాగర్, శ్రీధర్, మార్కండేయులు, అలాగే పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీలో సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్థినిల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు, సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. చెట్లతాండ్ర గ్రామానికి చెందిన చక్క రామారావు, లక్ష్మి దంపతుల ముగ్గురు కుమార్తెలు అనిత, సమజ్ఞ, శరణ్య దండు గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. వీరు ముగ్గురూ క్రమశిక్షణతో చదివి 2021, 2025, 2026 విద్యా సంవత్సరాలలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఐఐఐటీలో సీట్లు సంపాదించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఇలా ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీట్లు పొందడం అరుదైన విషయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విజయం మిగిలిన విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులైన రామారావు, లక్ష్మీ దంపతులను జ్ఞాపికను అందజేసి, దుస్సాలువ కప్పి, బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట గంగన్న మాట్లాడుతూ, ఈ ముగ్గురు బాలికల విజయం పాఠశాలకు, విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఇలాంటి విజయాలు అరుదుగా జరుగుతుంటాయని, ఇలాంటి ఆణిముత్యాలు అయిన విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పై చదువులలో మరింత రాణించి పాఠశాల పేరు ప్రఖ్యాతలను మరింతగా ఇనుమడింప చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల తండ్రి రామారావు మాట్లాడుతూ, తమ పిల్లలను ఇంత చక్కగా, క్రమశిక్షణగా విద్యాభ్యాసం గావించిన పాఠశాల ఉపాధ్యాయుల సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. వారి కృషి వలనే తమకు ఇది సాధ్యమైందని, వారికి ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, శారదాంబ, అన్నాజీ, జె.శ్రీనివాసరావు, మురళీధరరాజు, రాము, సూర్యప్రకాష్, శ్రీధరు, విజయలక్ష్మి, కె.శ్రీనివాసరావు, లక్ష్మన్నునాయుడు, డి.శ్రీనివాసరావు, దయాసాగర్, శ్రీధర్, మార్కండేయులు, అలాగే పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- 😭🙏1
- కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉన్న ఆర్టీఐహెచ్ (RTIH) గ్రామీణ అవుట్పోస్ట్ కేంద్రంలో గ్రామీణ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్థానిక భాగస్వాములలో స్వయం ఉపాధి, వ్యవస్థాపకత పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం (REDP) మరియు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (ESDP) నాలుగో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యా, ప్రభుత్వ, స్టార్టప్ రంగాల నుండి వచ్చిన ప్రముఖ నిపుణులు వ్యవస్థాపకత, గ్రామీణ అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై విలువైన అవగాహన కల్పించారు. మొదటి సెషన్లో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన శ్రీ జయకుమార్ “డిజిటల్ పారిశ్రామికత”పై ప్రసంగిస్తూ, డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి గ్రామీణ యువత తమ వ్యాపార అవకాశాలను ఎలా విస్తరించుకోవాలో వివరించారు. రెండవ సెషన్లో డాక్టర్ కవల నాగేశ్వరరావు “గ్రామీణ పారిశ్రామికత” అంశంపై మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలను సృజనాత్మక ఆలోచనలు, సామాజిక భాగస్వామ్యం, స్థానిక వనరుల వినియోగం ద్వారా స్థిరమైన వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో తెలియజేశారు. మూడవ సెషన్లో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శివరామ్ ప్రసాద్, గ్రామీణ స్థాయిలో చిన్నతరహా పరిశ్రమలు, మష్రూమ్ సాగు, అలంకరణ చేపల పెంపకం, త్వరలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వర్క్షాప్లో ఆర్టీఐహెచ్ రాజమహేంద్రవరం ఇన్క్యూబేషన్ హెడ్ శ్రీ కె. చంద్ర ప్రకాశ్, ప్రోగ్రామ్ అసోసియేట్లు శ్రీ జి. పాండురంగ, శ్రీ టి. శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ ఆవిష్కర్తలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పరస్పర చర్చలు, ప్రాయోగిక ఉదాహరణలు, కార్యాచరణ ఆధారిత కార్యక్రమాల ద్వారా పాల్గొన్నవారు వ్యవస్థాపకత, వ్యాపార నిర్వహణ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన పొందారని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వినూత్న వ్యాపార అవకాశాల అన్వేషణకు ఈ కార్యక్రమం ప్రేరణగా నిలిచి, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తన 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆసుపత్రి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంలో బసవతారకం ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ, వేలాది మంది క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణతో పాటు వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలను అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.1
- హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో, ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాత్మక కార్యాచరణపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా, పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకులను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ప్రతి గులాబీ సైనికుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.1
- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి మంత్రులు చర్చించారు.1
- కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో, కస్టడీలో ఉన్న సాయికృష్ణ అదృశ్యమైన నేపథ్యంలో, సిట్ అధికారులు మంగళవారం విజయవాడలోని సింగ్నగర్లో సీఐ నాగరాజు ఇంట్లో విచారణ చేపట్టారు. మంగళవారం సీఐ నాగరాజును అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగ్నగర్లోని సీఐ ఇంటి వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.1
- పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ సీఐ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ పోస్ట్ పేర్కొంది.1
- 😭🙏1
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసే నైతిక అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని రామచంద్రపురం నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాపు సమాజానికి ఇచ్చిన హామీలను విస్మరించి, ఇప్పుడు కాపుల పేరుతో సమావేశాలు నిర్వహించడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వారు విమర్శించారు. రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కాపు నాయకులు కంచుమర్తి బాబురావు, అన్యం శ్రీరామ్, కొట్టువాడ హరిబాబు, దేవు వెంకటరాజు, ఆళ్ళ బుజ్జి సహా పలువురు కూటమి పార్టీ నాయకులు మాట్లాడారు. కాపు వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఆ హామీని పూర్తిగా విస్మరించి కాపులను మోసం చేసిందని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి, యువత ఆశయాలను దెబ్బతీసిన పార్టీ వైసీపీనే అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు దురుద్దేశపూరితమైనవని వారు పేర్కొన్నారు. ఆయన కాపుల నాయకుడు మాత్రమే కాదని, రైతు, కార్మికుడు, యువకుడు, మహిళ, మధ్యతరగతి కుటుంబం సహా అన్ని వర్గాల ఆశయాలకు ప్రతినిధిగా ఎదిగిన నాయకుడని స్పష్టం చేశారు. ప్రజల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అధికారం కోసం కాకుండా బాధ్యత కోసం రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడని కొనియాడారు. దేశ ప్రధానమంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించడం ఆయన రాజకీయ స్థాయి, జాతీయ ప్రాధాన్యతను తెలియజేస్తుందని, నిజాయితీ, నిబద్ధత, ధైర్యం, తెగింపు, దేశభక్తి ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని తెలిపారు. వెంకటాయపాలెంలో తోట త్రిమూర్తులు నిర్వహించిన సమావేశం కాపు సంక్షేమం కోసం కాదని, కొందరు నాయకుల రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నమని కూటమి నాయకులు విమర్శించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నాయకులను సమీకరించి సమావేశం నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని అన్నారు. గతంలో కాపు ఉద్యమాల సమయంలో కేసులు నమోదై యువత ఇబ్బందులు పడుతున్నప్పుడు మౌనం వహించిన నాయకులు, ఇప్పుడు కాపులపై కపట ప్రేమ చూపించడం రాజకీయ అవకాశవాదమేనన్నారు. “వైఎస్ఆర్ కాపులు” అనే పేరుతో కాపు సమాజాన్ని రాజకీయంగా విభజించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని, కాపులు ఒక పార్టీకి బానిసలు కారని, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే సామర్థ్యం ఉన్న సమాజమని స్పష్టం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ అభివృద్ధి, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని కూటమి నాయకులు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, కాపు సమాజ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకత్వానికి మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావించామని పేర్కొన్నారు. తాము పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, సమాజ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, కాపు యువత భవిష్యత్తు కోసం మాత్రమే కూటమిని బలపరిచామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కూటమి నాయకులు సూచించారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే రోజులు ముగిశాయని, ప్రజలు చైతన్య వంతులయ్యారని పేర్కొంటూ, "కులాలను విభజించే రాజకీయాలు జగన్కు సాధ్యమైతే... కులాలను కలిపే రాజకీయాలు పవన్ కళ్యాణ్తోనే సాధ్యం" అని నాయకులు స్పష్టం చేశారు.1